• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కామారెడ్డిలో వార్.. ముగింపు కార్డు పడనుందా..?

KMR: సవాళ్లు, ప్రతి సవాళ్లతో కామారెడ్డి రణరంగంగా మారింది. అభివృద్ధి విషయంలో పోరాడాల్సిన వారే ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి ఇరు పార్టీల అధినేతలు వెళ్లి సంబంధిత అంశాలపై చర్చించి నిజానిజాలు తేల్చుకుంటారా! ఈ అంశాలపై ముగింపు కార్డు వేస్తారా! అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

February 22, 2026 / 10:56 AM IST

‘ప్రజలపై మరింత విశ్వాసం పెంచాలి’

KMM: సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్ రహానా బేగం కమల్ పాషా, వైస్ ఛైర్మన్ సుమలత వేణు, అలాగే సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లను ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రాగమయి సత్కరించారు. ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసేలా పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే వారికి తేనెటీ విందు ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 10:55 AM IST

‘మహాసభను జయప్రదం చేయండి’

BDK: ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగే కమ్యూనిస్ట్ మహాసభను జయప్రదం చేయాలని మాజీ సర్పంచ్ శ్రీను తెలిపారు. ఇల్లందు మండలం పోచారం గ్రామంలో పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. భారతదేశం ఒక అర్ధ వలస, అర్ధ బుస్వామ్య వ్యవస్థ అని, దీనిని కూల్చివేసి నూతన వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం విప్లవ పందా మార్గంలో అందరం నడవాలని అన్నారు.

February 22, 2026 / 10:55 AM IST

బోరుకు మరమ్మతు చేయించిన వార్డు కౌన్సిలర్

నిర్మల్: ఖానాపూర్ పట్టణం గాంధీ నగర్ కాలనీలోని బోరు చెడిపోయి ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ గొర్రె తిరుమల ఘటన స్థలానికి చేరుకుని దగ్గరుండి సిబ్బందితో బోరు రిపేర్ చేయించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.

February 22, 2026 / 10:53 AM IST

మురళీకృష్ణుడి అవతారంలో లక్ష్మీ నరసింహుడు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం ఉదయం శ్రీ కృష్ణాలంకారములో లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ ఉండనుంది. స్వామివారి దర్శనానికి భక్తులు యాదగిరిగుట్టకు భారీగా తరలి వస్తున్నారు.

February 22, 2026 / 10:50 AM IST

రేపటి నుంచి ‘ప్రజావాణి’ పునఃప్రారంభం

ASF: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రేపటి నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో యథావిధిగా వినతుల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

February 22, 2026 / 10:47 AM IST

‘భూ కబ్జాలు చేస్తే సహించేది లేదు’

KMM: భూ కబ్జాల పేరుతో పేదలను మోసం చేస్తే సహించేది లేదని RI ప్రసాద్ తెలిపారు. ఏదులాపురం కేంద్రీయ విద్యాలయం సమీపంలోని సుమారు రూ.2 కోట్ల విలువైన ప్రభుత్వ సీలింగ్ భూమి ఆక్రమణను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. MRO రాంప్రసాద్ ఆదేశాల మేరకు ఆర్‌ఐ సిబ్బందితో కలిసి ఆదివారం జేసీబీతో అక్రమ పునాదులను తొలగించారు. అనంతరం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

February 22, 2026 / 10:47 AM IST

ఈనెల 25న వాహనాలకు వేలం పాట

మహబూబాబాద్ ఎక్సైజ్ అండ్ ప్రోహిబిషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈ నెల 25వ తేదీన ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేలం పాటలో పాల్గొనాలనుకునే వారు 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల వారు వినియోగించుకోవాలని కోరారు.

February 22, 2026 / 10:46 AM IST

సంతానం కలగలేదని వ్యక్తి ఆత్మహత్య

MBNR: బాదేపల్లి పాతబజార్‌‌కు చెందిన హమాలీ సుంకసారి శ్యామ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. జడ్చర్ల రైల్వే స్టేషన్ సమీపంలో రాయచూర్ డెమో ఎక్స్‌ప్రెస్ కింద పడి తనువు చాలించాడు. రైల్వే ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం.. శ్యాము వివాహమై 14 ఏళ్లు గడిచినా పిల్లలు కలగలేదు. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండంతో శ్యామ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు తెలిపారు.

February 22, 2026 / 10:42 AM IST

‘నీటి ఎద్దడిని సింగరేణి యాజమాన్యం తీర్చాలి’

BDK: ఫిల్టర్ బెడ్‌ను రిపేర్ చేసి నీటిపై నాచు లేకుండా చూడాలని సీపీఐ నాయకులు కోరారు. కొత్తగూడెం టౌన్ రామవరం ప్రజల నీటి ఎద్దడిని సింగరేణి యాజమాన్యం తీర్చాలని మాజీ కౌన్సిలర్లు కోరారు. ఆదివారం రామవరం సీపీఐ ప్రతినిధి బృందం ఫిల్టర్ బెడ్‌ను సందర్శించారు. తక్షణమే రెండు పూటల మంచినీళ్లు అందించాలని, స్టాండ్ బై మోటార్లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

February 22, 2026 / 10:41 AM IST

నగరంలో మండుతున్న ఎండలు

HYD: ఫిబ్రవరి నెల ముగియకముందే HYDలో ఎండలు మండుతున్నాయి. ఇంట్లో ఉన్నా ఉక్కపోత తప్పడం లేదు. బయటకు వెళ్తే టోపీనో, గొడుగో తీసుకెళ్లాల్సి వస్తోంది. భానుడి ప్రతాపంతో.. సహజంగా నడి వేసవిలో కనిపించే ఎండమావులు ఇప్పుడే ఏర్పడుతున్నాయి. కాగా, ఏప్రిల్, మే నెలల్లో మరింత అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

February 22, 2026 / 10:40 AM IST

మార్కెట్ కమిటీ ఆఫీస్ ఆవరణలో స్వచ్ఛ కార్యక్రమం

NZB: అర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛ సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం 43వ స్వచ్ఛ ఆర్మూర్ కార్యక్రమం నిర్వహించారు. ఆవరణలో ఉన్న చెత్త తొలగించి ఆవరణలో ఉన్న వాటిని శుభ్రం చేశారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో ఆర్మూర్ స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నమన్నారు.

February 22, 2026 / 10:39 AM IST

అభివృద్ధే లక్ష్యంగా సర్పంచుల శిక్షణ

SDPT: గ్రామాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సర్పంచులు సమర్థవంతంగా పనిచేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఐదు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. తొలి విడతగా అక్కన్నపేట మండలానికి చెందిన 38 గ్రామపంచాయతీ సర్పంచులు శిక్షణను పూర్తి చేశారు. ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేందుకు, పరిపాలన నైపుణ్యాలు అభివృద్ధి చేసేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుంది.

February 22, 2026 / 10:37 AM IST

బెల్లంపల్లిలో ప్రారంభమైన గురుకుల పరీక్ష

మంచిర్యాల: బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ గురుకులాల్లో ఐదు నుంచి తొమ్మిదవ తరగతి వరకు ఉన్న బ్యాక్‌లాగ్ సీట్ల భర్తీకి ఆదివారం నిర్వహిస్తున్న పరీక్ష ప్రారంభమైంది. బెల్లంపల్లిలో మొత్తం నాలుగు పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు విద్యార్థులు తమ తమ హాల్ టికెట్లతో పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు.

February 22, 2026 / 10:33 AM IST

మేడిపల్లిలో “Run For A Drug-Free Life” అవగాహన రన్

MDCL: మత్తు పదార్థాల బారిన పడుతున్న యువతను రక్షించాలనే లక్ష్యంతో మల్కాజ్‌గిరి కార్పొరేషన్ పరిధిలోని నారపల్లి నందనవనంలో “Run For A Drug-Free Life” అవగాహన రన్ నిర్వహించారు. శాంతివనం రన్నర్స్, మెడిపల్లి ఆధ్వర్యంలో HYD రన్నర్స్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమం యువతలో విశేష స్పందన లభించింది. ఈ రన్‌‌ను జక్క వెంకట్ రెడ్డి, తుంగతుర్తి రవిలు ప్రారంభించారు.

February 22, 2026 / 10:32 AM IST