• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జిల్లాలోని 248 GPలకు నిధులు మంజూరు

BHPL: భూపాలపల్లి జిల్లాలోని 248 గ్రామాలకు ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం తొలిసారిగా రూ.4.65 కోట్లు విడుదల చేసినట్లు DPO శ్రీలత ఇవాళ తెలిపారు. 2011 జనాభా ఆధారంగా ఒక్కో వ్యక్తికి రూ.865 చొప్పున లెక్కించి నేరుగా పంచాయతీ ఖాతాల్లోకి జమ చేశామని DPO వెల్లడించారు.

February 22, 2026 / 11:12 AM IST

టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు

KMR: బిక్కనూరు మండల పరిధిలోగల టోల్ ప్లాజా వద్ద ఆదివారం పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో పలు వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

February 22, 2026 / 11:12 AM IST

రైస్ మిల్‌ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

NLG: మిర్యాలగూడ మండలం ఆలగడపలో నూతనంగా ఏర్పాటు చేసిన RSN రైస్ మిల్‌ను మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారంగా ఉన్న మన ప్రాంతంలో రైస్ మిల్లుల స్థాపన రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. మిల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ, వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

February 22, 2026 / 11:11 AM IST

బరంపూర్ గుట్ట బ్రహ్మోత్సవాలకు వెళ్లొద్దామా..!

ఆదిలాబాద్: తలమడుగు మండలం బరంపూర్ గ్రామం సమీపంలో చుట్టూ అందమైన కొండల మధ్యలో గుట్టపై వెలసిన పురాతన వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో ఈ ఆలయానికి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. కాగా, నేడు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు.

February 22, 2026 / 11:10 AM IST

ఆధ్యాత్మికతతో ముందుకు పయనించాలి: MLA

ADB: గ్రామస్తులు కలిసికట్టుగా ఉండి ఆధ్యాత్మికతతో ముందుకు పయనించాలని అభివృద్ధి సాధించాలని MLA అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం బోథ్ మండలంలోని కౌట గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు డప్పుల చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.

February 22, 2026 / 11:09 AM IST

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అమ్మవారిని విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. నేడు సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని.. కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

February 22, 2026 / 11:05 AM IST

ఈ నెల 24న మినీ జాబ్ మేళా

మంచిర్యాల ప్రభుత్వ ITI కళాశాలలో ఈ నెల 24న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఆదివారం ప్రకటనలో తెలిపారు. శృతి గోలిస్ బర్త్ రూట్ ఆస్పత్రిలో డాటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, హౌస్ కీపింగ్, ఫార్మసిస్ట్, సిస్టం ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 11:05 AM IST

రహదారి గుంతలమయం.. వాహనదారులకు నరకయాతన

PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధి 47వ డివిజన్ మార్కండేయ కాలనీలోని కృష్ణుడి ఆలయం సమీప ప్రధాన రహదారి గుంతలతో దెబ్బతింది. వాహనదారులు తరచుగా వాహన మరమ్మతులతో ఆర్థిక నష్టానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలుగా మ్యాన్‌హోల్ లీకేజీ కారణంగా మురుగునీరు నిల్వ ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

February 22, 2026 / 11:04 AM IST

‘గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలి’

KMM: సత్తుపల్లి పట్టణంలో పాకలగూడెం గ్రామ నూతన సర్పంచ్ సునీత TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి చేరవేయాలని సర్పంచ్‌కు సూచించారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని తెలిపారు.

February 22, 2026 / 11:02 AM IST

టార్గెట్ ఫిక్స్ అయింది .. ఇక పనుల జాతరే..!

NLG: జిల్లా కేంద్రం ‘వీబీ జీ రామ్ జీ’ పథకంలో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 లక్షల కుటుంబాలకు 125 రోజుల పని దినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నల్లగొండ జిల్లాలో 7.44 లక్షల జాబ్ కార్డు ఉండగా ఇందుకోసం రూ.1.16 కోట్ల పని దినాలను అంచనా వేశారు. అవినీతిని అరికట్టేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 11:02 AM IST

నూతన పాలకవర్గానికి మంత్రి అభినందనలు

RR: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో మొయినాబాద్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. ఇటీవల మోయినాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు, నూతన పాలకవర్గానికి మంత్రి అభినందనలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా ముందుకు పోవాలన్నారు.

February 22, 2026 / 11:01 AM IST

మక్తల్ రహదారి ప్రమాదకర పరిస్థితి..!

NRPT: మక్తల్ మండలంలోని జక్లేర్ నుంచి రామసముద్రం వరకు రహదారిలో మలుపుతిరిగే ప్రాంతంలో గుంతలు ఏర్పడడంతో స్థానికులు, వాహనదారులు భయపడుతున్నారు. రాత్రి సమయాల్లో ఘోర ప్రమాదాలు జరిగే అవకాశాన్ని వాపోతున్నారు. అధికారులు వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

February 22, 2026 / 11:00 AM IST

నీటి సంపులో పడి బాలిక మృతి

RR: ఆడుకుంటూ వెళ్లి బాలిక నీటి సంపులో పడి మృతి చెందిన ఘటన మంచాల మండల పరిధిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని తాళ్లపల్లిగూడలో ఆడుకునేందుకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. దీంతో ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో బాలిక మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

February 22, 2026 / 10:58 AM IST

పార్టీ నేత మృతదేహానికి నివాళులర్పించిన బొల్లం

SRPT: చిలుకూరు మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఓబులు మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఓబులు భౌతికకాయానికి ఆయన నివాళులర్పించి, పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం శోకసప్త కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు.

February 22, 2026 / 10:56 AM IST

‘నిషేధిత ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు’

ASF: సింగిల్ యూజ్‌డ్ ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధమని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ బీ.తిరుపతి ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్లాస్టిక్ కవర్లు, ఇతర నిషేధిత వస్తువులను విక్రయిస్తున్న వ్యాపారులను గుర్తించి సామగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు ప్లాస్టిక్‌కు బదులు పర్యావరణ హితమైన వస్తువులను వినియోగించాలన్నారు.

February 22, 2026 / 10:56 AM IST