KMM: ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు. సత్యనారాయణపురంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుడి గృహ ప్రవేశ వేడుకలో పాల్గొన్న ఆయన, నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపి, పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు.
MBNR: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ రేపటి నుంచి పాదయాత్ర చేబుతున్నట్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రేపటి యాత్రకు న్యాయవాదులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
BHNG: తుర్కపల్లి మండల తహసీల్దార్గా రవికుమార్ను నియమిస్తూ కలెక్టర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న తహసీల్దార్ జలకుమారి కలెక్టరేట్కు బదిలీ అయ్యారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న రవికుమార్ను తుర్కపల్లి తహసీల్దార్గా నియమించారు. మూడేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో తహసీల్దార్ సేవలందించిన ఆయనను మరోసారి ఇక్కడికే నియమించడం విశేషం.
GDWL: స్థానిక ప్రాక్టీసింగ్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన గురుకుల ప్రవేశ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బీ.ఎం. సంతోష్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి రూమ్కు వెళ్లి ఆయన పరిశీలించారు. మాస్ కాపీ జరగకుండా జాగ్రతలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని చెప్పారు.
NRPT: మద్దూర్ మున్సిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్ గోవిందు ముదిరాజ్ ప్రెస్ మీట్లో తనకు ఛైర్మన్ పదవి ఇస్తామని ఏనుముల తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల నాయకులు ఎవరూ.. హామీ ఇవ్వలేదని తెలిపారు. ఛైర్మన్ అవుతాననే నమ్మకంతోనే కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశానన్నారు. బీఆర్ఎస్ నాయకుల విమర్శ తగదని, పార్టీ తుది నిర్ణయమే తన నిర్ణయం అని ఆయన స్పష్టం చేశారు.
HYD: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పెద్ద శంకరంపేట పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాన్సువాడలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా రాజాసింగ్ హైదరాబాద్ నుంచి బాన్సువాడ బయలుదేరారు. ఈ క్రమంలో ఆయనను బాన్సువాడకు వెళ్లకుండా ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజాసింగ్ అరెస్ట్ను మండల బీజేపీ నాయకులు ఖండిస్తున్నారు.
WNP: సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కార్యదర్శి విజయరాములు తెలిపారు. ఈ సమావేశానికి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాల నరసింహ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై చర్చించనున్నారు. అలాగే జిల్లాలోని ప్రజా సమస్యలపై పోరాట కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.
SRPT: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం పునఃప్రారంభం కానుంది. ఈ నెల 23వ తేదీ నుంచి కలెక్టర్ కార్యాలయంలో యథాతథంగా నిర్వహిస్తామని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదివారం తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని స్థానిక ఏకలవ్య ఆదర్శ పాఠశాలలో ఆదివారం గురుకుల ప్రవేశ పరీక్షా ప్రశాంతంగా ముగిసింది. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు తరలిరాగ.. పాఠశాల వద్ద రద్దీ ఏర్పడింది. విద్యార్థులకు అన్ని ఏర్పాట్లతో పరీక్షను నిర్వహించామని సిబ్బంది పేర్కొన్నారు. ఈ మేరుకు పరీక్షా ముగించుకున్న విద్యార్థులు తిరిగి ఇంటి బాట పట్టారు.
HYD: బల్కంపేట్ రేణుకా ఎల్లమ్మ తల్లిని ఆదివారం సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించారు. పలు రకాల పుష్పాలు, ఫలాలతో అమ్మవారిని అత్యంత సుందరంగా గర్భగుడిని తీర్చిదిద్దారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించి, దీప ధూప నైవేద్యాలు సమర్పించి, మంగళహారతులు ఇచ్చారు. భక్తజన సందోహంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దర్శనానికి సుమారు 30 నిమిషాల సమయం పడుతుంది.
VKB: దోమ మండలం మల్లేపల్లిలో ఈ నెల 24, 25న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ కమిటీ తెలిపారు. 24న ధ్వజస్తంభ ప్రతిష్ఠ, ధ్వజారోహణ, ఆంజనేయస్వామి అభిషేకం, గణపతి, నరసింహస్వామి హోమం, మంగళహారతి, ప్రసాద వితరణ, ఊరేగింపు, సుప్రభాతం, అభిషేకం, చండిహోమం నిర్వహించబడతాయి. 25న స్వామివారి కళ్యాణం, మంగళహారతి కార్యక్రమాలు జరగనున్నాయి.
PDPL: మంథని మండలంలోని చిల్లపల్లి గ్రామంలోని సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు లేదా ఇతర ఘటనలపైనా అవి నిర్ధారణలో సహాయం చేయలేవనే సమస్య తలెత్తింది. ప్రస్తుత పరిస్థితిలో కెమెరాలు నేలవైపు మళ్లీ ఉన్నాయి. స్థానికులు అధికారులు వెంటనే చర్య తీసుకుని కెమెరాలను సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని కోరుతున్నారు.
ADB: బోథ్ మండలంలోని కౌట గ్రామంలో పోచమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గ్రామస్థులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లో దేవాలయాలు ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రాలుగా నిలుస్తాయని, గ్రామ ఐక్యతకు ఇవి ప్రతీకలని అన్నారు.
SRCL: దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. అర్చక స్వాములు, వేద పండితులు తెల్లవారుజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అందరిని చల్లగా చూడు రాజన్నా, భీమన్నా అంటూ భక్తజనం వేడుకుంటున్నారు. రాజన్నకు ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకుంటున్నారు.
MDK: శివంపేట మం. దంతాన్పల్లిలో సర్పంచ్ మమత ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో వృద్ధులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. నిపుణులైన వైద్యులు ఉచితంగా సలహాలు అందించి, అవసరమైన వారికిపై వైద్యం కోసం రిఫరల్ సేవలు సూచించారు.