• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అక్రమ రవాణా చేస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

BHNG: ఆలేరు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై అధికారులు చర్యలు చేపట్టి ఐదు ట్రాక్టర్లను పట్టివేశారు. ఈ సందర్భంగా ఎస్సై వినయ్ కుమార్ పట్టుబడిన ట్రాక్టర్లపై సంబంధిత నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

March 12, 2026 / 07:02 AM IST

మైనర్ బాలికకు అబార్షన్? స్కానింగ్ సెంటర్ సీజ్

NGKL: కొల్లాపూర్ సాయి కృప ఆసుపత్రిలో మైనర్ బాలికకు అబార్షన్ చేశారన్న ఫిర్యాదుతో డీఎస్పీ శ్రీనివాస్ యాదవ్, డీఎంహెచ్వో డా.రవి కుమార్ సుదీర్ఘంగా తనిఖీలు చేపట్టారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ సోదాల అనంతరం ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి నివేదికను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.

March 12, 2026 / 06:54 AM IST

ధాన్యం దుర్వినియోగం కేసులో రైస్ మిల్ యజమాని అరెస్ట్

ASF: కౌటాల మండలంలో ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసిన కేసులో శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ యజమాని వెంకటేశ్వర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 1353.7 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి ఇవ్వకుండా దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. రూ. 6.27 కోట్ల విలువైన ధాన్యాన్ని ఇతరులకు విక్రయించినట్లు విచారణలో తేలింది.

March 12, 2026 / 06:45 AM IST

వికసిత్ భారత్ జిల్లా స్థాయి పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

GDWL: మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ కళాశాలలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు బుధవారం ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కలందర్ బాష, జిల్లా యువజన అధికారి కోట నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విజేతలకు అధ్యాపక బృందం బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించింది.

March 12, 2026 / 06:42 AM IST

టెన్త్ పరీక్షలు.. డీఈఓ కీలక సూచనలు

SDPT: ఈనెల 14వ తేదీ నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థులకు సిద్దిపేట DEO శ్రీనివాస్ రెడ్డి కీలక సూచనలు చేశారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలన్నారు. మొబైల్ ఫోన్లు, వాచీలు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. విద్యార్థుల వస్తువుల భద్రత కోసం క్లాక్ రూమ్ సౌకర్యం కల్పించామని తెలిపారు.

March 12, 2026 / 06:42 AM IST

జిల్లాలో నాలుగు రోజులు మిషన్ భగీరథ వాటర్ బంద్

VKB: మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా తాండూరు, బషీరాబాద్, యాలాల్, పెద్దేముల్, ధరూర్‌లో నీటి సరఫరాకు నేటి నుంచి 15వ తేదీ వరకు అంతరాయం కలగనుంది. రాఘవాపూర్ నుంచి పరిగి వరకు ఉన్న ప్రధాన పైప్‌లైన్‌లో లీకేజీలు ఏర్పడటమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

March 12, 2026 / 06:41 AM IST

58వ డివిజన్ సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్‌కు వినతి

MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 58వ డివిజన్ సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ బొట్ల అనిత మేయర్ మధుకర్‌కు వినతిపత్రం అందజేశారు. డ్రైనేజీ పూడికతీత నిలిచిపోవడంతో దోమల బెడద పెరిగిందని, స్ట్రీట్ లైట్లు, బోర్లు పనిచేయడం లేదని విన్నవించారు. పార్కు నిర్వహణ అధ్వానంగా ఉందన్న ఆమె, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.

March 12, 2026 / 06:40 AM IST

పట్టణంలో గల్లి గల్లీకి ఒక స్మోకింగ్ జోన్

MNCL: జిల్లాలో విచ్చలవిడిగా స్మోకింగ్ జోన్లు సాగుతున్నాయి. ధూమపాన ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా సిట్టింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. పట్టణంలో గల్లి గల్లీకి ఒక స్మోకింగ్ జోన్ ఉండడం గమనార్హం. కొన్ని చోట్ల స్మోకింగ్ పేరుతో గంజాయి విక్రయాలు కూడా సాగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు స్మోకింగ్ జోన్లపై దృష్టి సారించాలని కోరుతున్నారు.

March 12, 2026 / 06:36 AM IST

కొమ్మాల జాతర ఆదాయం రూ. 21.22 లక్షలు

WGL: గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మి నరసింహస్వామి జాతరలో మొత్తం ఆదాయం రూ. 21,22,410 వచ్చినట్లు ఆలయ ఈవో ఉగాది ప్రసాద్ తెలిపారు. దేవాదాయశాఖ పర్యవేక్షకుడు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆలయంలోని హుండీల, శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనాలు, కేశ ఖండనం ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచి యమున, తదితరులు పాల్గొన్నారు.

March 12, 2026 / 06:32 AM IST

డ్రంకన్ డ్రైవ్లో 21 మందికి భారీ జరిమానా

NZB: జిల్లా కేంద్రంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 22 మందిని పోలీసులు పట్టుకుని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్, 21 మందికి మొత్తం రూ.2.10 లక్షలను జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. మరొకరికి వారం రోజుల పాటు జైలు శిక్ష ఖరారు చేశారు. అంతకుముందు నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.

March 12, 2026 / 06:32 AM IST

‘విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి’

MNCL: విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూర్‌లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని, వార్డెన్ కు సూచించారు. SSC పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలన్నారు.

March 12, 2026 / 06:32 AM IST

‘శాంతిభద్రతల పర్యవేక్షణలో ఏఆర్‌ల పాత్ర కీలకం’

SRCL: శాంతిభద్రతల పరిరక్షణలో ఆర్ముడ్ రిజర్వ్ (AR) దళాల పాత్ర కీలకమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. సిరిసిల్ల పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన సాయుధ దళాల సమీకరణ కవత్తులో ఆయన పాల్గొని ప్రసంగించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసులు వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. ఫైరింగ్, రాత పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు.

March 12, 2026 / 06:25 AM IST

పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ

ADB: జైనథ్ మండలం కౌట గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బుధవారం పదవ తరగతి విద్యార్థులకు శివ గర్జన అసోసియేషన్ ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్లు, పెన్నులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే పరీక్షలను ప్రతి ఒక్క విద్యార్థి నిర్భయంగా రాసి మంచి మార్కులు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ యువకులు పాల్గొన్నారు.

March 12, 2026 / 06:21 AM IST

‘ఇఫ్తార్ వేడుకలు మనుషుల మధ్య సూత్ర భవాని పెంపొందించాలి’

MBNR: ఇఫ్తార్ వేడుకలు మనుషుల మధ్య సూత్ర భావాన్ని పెంపొందించాలని మహబూబ్‌నగర్ టీపీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలోని 59వ డివిజన్లో కార్పొరేటర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.

March 12, 2026 / 06:21 AM IST

స్టడీ సర్కిల్ మెస్‌కు దరఖాస్తుల ఆహ్వానం

JGL: పట్టణంలో నిర్వహించే ఐదు నెలల ఫౌండేషన్ కోర్సుకు శిక్షణ పొందుతున్న 100 మందికి భోజనాల కోసం మెస్/క్యాటరింగ్ నిర్వహించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అధికారి రాజ్ కుమార్ తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 14లోపు దరఖాస్తు చేయాలని సూచించారు. వివరాలకు 9959264770ఈ నంబర్‌ను సంప్రదించాలన్నారు.

March 12, 2026 / 06:20 AM IST