GDWL: మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ కళాశాలలో ‘వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్’ జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు బుధవారం ఘనంగా జరిగాయి. ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కలందర్ బాష, జిల్లా యువజన అధికారి కోట నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో పలువురు విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. విజేతలకు అధ్యాపక బృందం బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించింది.