NGKL: రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ హైదరాబాద్లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నరేందర్ రెడ్డి లాంటి నిబద్ధత గల నాయకుడికి ఈ పదవి దక్కడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.