PPM: జిల్లాలోని అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, నివాస పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు LPG సిలిండర్ల సరఫరాలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని జేసీ సీ.యశ్వంత్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన తన ఛాంబర్లో జిల్లా పౌరసరఫరాల శాఖ, SC, ST సంక్షేమ శాఖల ఉప సంచాలకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్యాస్ కొరత రాకుండా చూడాలని జేసీ అధికారులను ఆదేశించారు.