VKB: మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా తాండూరు, బషీరాబాద్, యాలాల్, పెద్దేముల్, ధరూర్లో నీటి సరఫరాకు నేటి నుంచి 15వ తేదీ వరకు అంతరాయం కలగనుంది. రాఘవాపూర్ నుంచి పరిగి వరకు ఉన్న ప్రధాన పైప్లైన్లో లీకేజీలు ఏర్పడటమే దీనికి కారణమని అధికారులు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.