BHNG: ఆలేరు మండలంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లపై అధికారులు చర్యలు చేపట్టి ఐదు ట్రాక్టర్లను పట్టివేశారు. ఈ సందర్భంగా ఎస్సై వినయ్ కుమార్ పట్టుబడిన ట్రాక్టర్లపై సంబంధిత నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.