NZB: జిల్లా కేంద్రంలో మద్యం తాగి వాహనాలు నడిపిన 22 మందిని పోలీసులు పట్టుకుని బుధవారం కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్, 21 మందికి మొత్తం రూ.2.10 లక్షలను జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. మరొకరికి వారం రోజుల పాటు జైలు శిక్ష ఖరారు చేశారు. అంతకుముందు నిందితులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు.