• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పంపు హౌస్ వద్ద పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే

JGL: మల్యాల మండలం రాంపూర్ పంప్ హౌస్ వద్ద వరద కాలువలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు పూర్తి నిరాధారమన్నారు. వేసవి కరువులో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా ఎగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

March 2, 2026 / 10:38 AM IST

రాజీమార్గమే రాజమార్గం: ఎస్సై

KNR: పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించుకోవడమే శ్రేయస్కరమని కేశవపట్నం ఎస్సై శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈనెల 28న నిర్వహించనున్న లోక్ అదాలత్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతి, సామరస్య వాతావరణంలో కేసులు పరిష్కరించుకోవడానికి ఇది చక్కని వేదికని తెలిపారు. సత్వర న్యాయం పొందాలనుకునే కక్షీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 2, 2026 / 10:36 AM IST

కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: TPCC చీఫ్

HNK: జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. 10 రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డికి వారు సర్టిఫికెట్లను అందజేశారు.

March 2, 2026 / 10:35 AM IST

వరంగల్ మహానగరంలో వాటర్ ట్యాంకర్ల అక్రమ దందా

వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో వాటర్ ట్యాంకర్ల అక్రమ వాడకం బాగా పెరిగింది. ప్రభుత్వం పేదలకు, సామాన్యులకు సరఫరా చేయాల్సిన తాగునీటిని కొందరు ట్యాంకర్ డ్రైవర్లు ప్రైవేటు ఇంటి నిర్మాణాలు, హోటళ్లు, వ్యాపార సంస్థలకు అక్రమంగా తరలిస్తున్నారు. ఒక ట్యాంకర్‌కు రూ.800 నుంచి రూ.1,000 వరకు వసూలు చేస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.

March 2, 2026 / 10:35 AM IST

రైతులకు పీఎసీఎస్ సీఈవో సూచన

MNCL: జన్నారం మండలంలోని చింతగూడా, పోన్కల్ పీఎసీఎస్‌ల ద్వారా రైతులకు యూరియా బస్తాలను అందజేస్తున్నామని చింతగూడ పీఏసీఎస్ సీఈవో కావేటి రాజయ్య తెలిపారు. చింతగూడ, పోన్కల్ పిఎసిఎస్ లకు 266 చొప్పున యూరియా బస్తాలు వచ్చాయన్నారు. యూరియా యాప్ ద్వారా బుక్ చేసుకున్న రైతులకు బస్తాలను అందజేస్తున్నామని తెలిపారు. మంగళ, బుధవారాలలో యూరియా బస్తాలు రానున్నాయని తెలిపారు.

March 2, 2026 / 10:33 AM IST

చలో హైదరాబాద్కు తరలిన విద్యుత్ కార్మికులు

NRPT: విద్యుత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గుండుమల్ మండలానికి చెందిన విద్యుత్ మీటర్ రీడింగ్ కార్మికులు చలో హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర్హతను బట్టి సబ్‌స్టేషన్‌లలో ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయాలని, మీటర్ రీడింగ్ తర్వాత 30 రోజుల పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో 11 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు.

March 2, 2026 / 10:33 AM IST

కీసర కనుచూపుమెరలో పచ్చని పైరు గాలి.. పంట పొలాలు..!

HYDలో ఉరుకుల పరుగుల జీవితంలో కాస్త విశ్రాంతి, ప్రశాంతత కోసం కీసర ఔటర్ రింగ్ రోడ్డు పరిసర ప్రాంతాల్లో పట్టణ యువత జాలిగా గడిపిస్తుంటారు. కీసర కనుచూపు మెరలో పచ్చని పంట పొలాలు, ప్రస్తుతం అందరికీ ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అక్కడికి వెళ్లిన యూత్, రైతులతో మాట్లాడుతూ.. పచ్చని పైరుగాలని ఆస్వాదిస్తూ మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నట్టు తెలిపారు.

March 2, 2026 / 10:32 AM IST

చింతకుంట తండాలో బీఆర్ఎస్‌లో చేరికలు

MBNR: బాలానగర్ మండలం చింతకుంట తండాలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కార్యకర్తలు స్వచ్ఛందంగా చేరుతున్నారని తెలిపారు.

March 2, 2026 / 10:31 AM IST

వీధి కుక్కల దాడి.. ముగ్గురికి గాయాలు..!

SRCL: బోయిన్ పల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఆదివారం వీధి కుక్కలు దాడి చేయడంతో ఇద్దరు చిన్నారులు, ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. కావ్య (7)కు చేయి విరగగా, అపర్ణిక (6), తీర్థాల కనకయ్య (55) గాయపడ్డారు. మూడు కుక్కలకు రేబిస్ సోకినట్లు సమాచారం. గ్రామస్తులు చర్యలు తీసుకున్నప్పటికీ, మరో రేబిస్ కుక్క ఇంకా సంచరిస్తున్నట్లు తెలుస్తోంది.

March 2, 2026 / 10:25 AM IST

అడవి పంది మాంసం స్వాధీనం

KMM: కామేపల్లి మండలం ముచ్చర్లలో అడవి పంది మాంసాన్ని ఫారెస్ట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముచ్చర్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు 8 కిలోల మాంసాన్ని కొనుగోలు చేసి పంచుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శిల్ప, బీట్ ఆఫీసర్ నాగరాజు సోమవారం తెలిపారు.

March 2, 2026 / 10:25 AM IST

‘పేదల పొట్టకొట్టే విధానాలు మానుకోండి’

BDK: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన పేదలకు ఉపాధి పనులు ఇవ్వకుండా అపడాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. సోమవారం పాల్వంచలో బి.చిరంజీవి అద్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి పనికి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముడిపెట్టి పేదల పొట్టకొట్టే విధానాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.

March 2, 2026 / 10:25 AM IST

ఆర్యభట్ట పాఠశాలపై అధికారుల చర్యలేవి..?

MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని ఆర్యభట్ట పాఠశాలలో గత మూడు రోజుల క్రితం 5వ తరగతి చదువుతున్న బాలుడిని ఉరితీసి స్లాబ్‌కి వేలాడదీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయంపై పాఠశాల యజమాన్యాన్ని బాలుడి తల్లిదండ్రులు నిలదీయడంతో నిజాన్ని కప్పిపుచ్చారు. న్యాయం కోసం బాధితులు తొర్రూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయారు.

March 2, 2026 / 10:25 AM IST

నేడు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణం!

MDK: కొల్చారం మండలం పైతర గ్రామంలో సోమవారం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. శ్రీ శ్రీ మాధవ నంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ వేడుకలో ధ్వజస్తంభ ప్రతిష్ట, లక్ష పుష్పార్చన, పాలాభిషేకం వంటి విశేష పూజలు నిర్వహించనున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా హాజరై స్వామివారిని దర్శించుకోవాలని సర్పంచ్‌ల అధ్యక్షుడు రవితేజ కోరారు .

March 2, 2026 / 10:25 AM IST

‘గడువు ముగిసేలోగా రుణాలు పంపిణీ చేస్తాం’

ASF: 2025- 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మహిళా సంఘాల సభ్యులకు రూ. 232.43 కోట్ల రుణాలను అందించాలనె లక్ష్యం చేరుకుంటామని ఆసిఫాబాద్ DRDO దత్తరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకు రూ.164.76 కోట్ల రుణాలను ఆయా సంఘాలకు పంపిణీ చేశామన్నారు. గడువు ముగిసేలోగా వందశాతం రుణాలు పంపిణీ చేసేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు.

March 2, 2026 / 10:23 AM IST

స్వగ్రామం చేరిన మాజీ మావోయిస్టు

PDPL: ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల కోటేశ్వరరావు 45 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత స్వగ్రామమైన పెద్దపల్లికి ఆదివారం వచ్చారు. 1980లో ఉద్యమ బాట పట్టిన మల్లోజుల మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగి ఇటీవల మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయాడు. కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

March 2, 2026 / 10:22 AM IST