MBNR: బాలానగర్ మండలం చింతకుంట తండాలో రాజకీయంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ ప్రజాసంక్షేమం కోసం కట్టుబడి ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కార్యకర్తలు స్వచ్ఛందంగా చేరుతున్నారని తెలిపారు.