ADB: ఆదిలాబాద్ రిమ్స్ కాంట్రాక్టు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. శనివారం రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ల యూనియన్ కమిటీని డైరెక్టర్కు పరిచయం చేశారు.
KMM: భూదాన్ భూముల బాధిత కుటుంబాలకు అదే భూమిలో పునరావాసం కల్పించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. శనివారం తీన్మార్ మల్లన్న అదనపు కలెక్టర్ను కలిసి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. తక్షణ సహాయం కింద ప్రతి బాధిత కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం అందించాలని చెప్పారు. పేదలపై దాడి సరికాదన్నారు.
WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 2వ, 7వ డివిజన్లలో మున్సిపాలిటీ ఛైర్మన్ పాలకుర్తి సారంగపాణి పరిశుభ్రత పనులను శనివారం తనిఖీ చేశారు. చెత్త బండి సకాలంలో వస్తుందా లేదా అని పర్యవేక్షించిన ఆయన, ప్రజలకు లేదా సిబ్బందికి సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బెజ్జం .పాపరావు, శానిటరీ సిబ్బంది పాల్గొన్నారు.
KNR: బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ ఆధ్వర్యంలో బీసీ సంఘం టేబుల్ క్యాలెండర్ను KNRలో మహాత్మ జ్యోతిబాపూలే మైదానంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి పరుశురాం గౌడ్, జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, తదితరులు పాల్గొన్నారు.
MHBD: నెల్లికుదురు మండలంలోని రత్తిరాం తండాకు చెందిన గుగులోతు వంశీకృష్ణ హైదరాబాదులో నూతనంగా ఏర్పాటు చేసిన సెంటిల్ కార్పొరేట్ కార్యాలయాన్ని మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత ప్రారంభించారు. సెంటిల్ కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయమని అన్నారు.
గద్వాల: పదో తరగతి పరీక్షలు అంటే భయం వద్దు, ఒత్తిడిని వీడి ప్రశాంతంగా చదివితే విజయం మీదే అని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. శనివారం జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గద్వాల బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్, ఫుడ్ ఫెస్టివల్ను ఆయన సందర్శించారు. విద్యార్థులు రూపొందించిన వైజ్ఞానిక నమూనాలను ప్రశంసించారు.
VKB: వికారాబాద్ 16 వార్డులో ఉన్న జడ్పీహెచ్ఎస్ బాలికల ఉన్నత పాఠశాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ హెల్త్ క్యాంపును మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం అనన్య, జిల్లా విద్యాధికారి రేణుక దేవితో కలిసి ప్రారంభించారు. విద్యార్థులు ఇలాంటి ఉచిత శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
BDK: భద్రాచలం పట్టణంలోని ఏడు పదకుండు అవార్డులో అభివృద్ధి పనులకు శనివారం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు శంకుస్థాపన చేశారు. వారితోపాటు సర్పంచ్ కృష్ణ ఉపసర్పంచ్ కవిత పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. భవిష్యత్తులో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామన్నారు.
HNK: ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో VO. భవన నిర్మాణ పనులకు స్థానిక ఎంపీ కడియం కావ్య భూమి పూజ చేశారు. మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ పథకాలను అర్హులైన మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలని ఎంపీ కడియం కావ్య పిలుపునిచ్చారు. అనంతరం స్థానికులతో ఎంపీ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
HYD: తెలంగాణలో ప్రతి ఏటా సుమారు 55 నుంచి 60 వేల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. మహిళల్లో కనిపించే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లో రెండో స్థానంలో ఉందని, రాష్ట్రంలో ఏటా దాదాపు 3,200 మందిని ప్రభావితం చేస్తున్నట్లు HYD MNJ క్యాన్సర్ హాస్పిటల్ టీం తెలిపింది. ఈ నేపధ్యంలోనే HPV వాక్సినేషన్ ప్రారంభించారు. అయితే, మొదటి స్థానంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది.
WGL: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని నర్సంపేట మున్సిపల్ ఛైర్పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ అన్నారు. 5వ వార్డులో స్థానిక నేతలతో కలిసి ఛైర్పర్సన్ పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నర్సంపేట పట్టణ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు.
WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం HM వసంత ఆధ్వర్యంలో ‘స్ఫూర్తి’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య ముఖ్యఅతిథిగా రిటైర్డ్ MEO దేవా హాజరై, మాట్లాడారు. విద్యార్థులు మత్తు పానీయాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల దృష్ట్యా సమయాన్ని వృథా చేయకూడదన్నారు.
KMR: నస్రుల్లాబాద్ మండలం దుర్కి శివారులోని SRNK డిగ్రీ కళాశాలలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కళాశాలలో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న షేక్ అహమ్మద్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు కొంతకాలంగా కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు.
MDCL: ఉప్పల్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో ప్రతిరోజూ బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచే వచ్చే రోగులకు ఉచితంగా రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించి వైద్యులు అవసరమైన సలహాలు అందిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులను ముందుగానే గుర్తించి నియంత్రణలో ఉంచేందుకు ఈ సేవలు ఉపయోగపడుతున్నాయి.
సంగారెడ్డి: 2024 నవంబర్లో కుల గణన సర్వే చేపట్టిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ వెంటనే విడుదల చేయాలని సిర్గాపూర్ PRTU మండల శాఖ ఆధ్వర్యంలో MPDO ఆఫీసులో సూపరింటెండెంట్కు శనివారం వినతి పత్రం అందించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాలని మండల శాఖ అధ్యక్షులు కర్ర నర్సింగ్ చౌహాన్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.