TG: బీసీలను కాంగ్రెస్ ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప చేసిందేమీ లేదని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల ఓట్లతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ఏటా బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్ అన్నారని.. కానీ ఇప్పటివరకు రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్య, ఉద్యోగాల్లో బీసీల ప్రస్తావన లేదన్నారు.
SDPT: సిద్దిపేట కలెక్టరేట్లో సోమవారం నిర్వహించాల్సిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. 2027 జనాభా లెక్కల సేకరణపై జిల్లా స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సోమవారం ఎవరూ కలెక్టరేట్కు రావద్దని ఆమె కోరారు.
TPT: రేణిగుంట మండలం మామండూరులో మహిళపై హత్యాయత్నం జరిగింది. నైట్ షిఫ్ట్కు వెళ్తున్న మునెమ్మ (36)పై పి. కృష్ణమూర్తి అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, నిందితుడు కూడా గాయాలతో చికిత్సలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
KRNL: YCP పార్టీ నాయకులు, BJPలో కోవర్టులుగా ఉన్నవారు కావాలనే జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, రాష్ట్రకార్యవర్గ సభ్యుడు రామస్వామిలపై తప్పుడు కేసులు నమోదు చేయించారని సుప్రీంకోర్టు అడ్వకేట్ పురుషోత్తంరెడ్డి అన్నారు. ఇవాళ ఓ గోల్డ్ సంస్థ వ్యవహారంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి CID విచారణ కోరనున్నట్లు తెలిపారు.
NZB: ప్రజల్ని చైతన్యం చేయడానికి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఎంతో కృషి చేస్తోందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసు అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆర్మూర్ పట్టణంలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అరుణోదయ మహాసభలను ఏప్రిల్ 10,11 తేదీల్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
PPM: గుమ్మలక్ష్మీపురం(మం) ఎల్విన్పేట ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న చెరువు ముస్తాబు పనుల్లో భాగంగా ‘ఐ లవ్ ఎల్విన్పేట’ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డు ప్రత్యేక లైటింగ్తో వెలుగుతూ.. గ్రామానికి కొత్త అందాన్ని తీసుకొచ్చింది. రాత్రి వేళల్లో ఇది ఆకర్షణీయంగా కనిపిస్తూ స్థానికులను, ప్రయాణికులను ఆకట్టుకుంటోంది.
KMM: భగత్ సింగ్ స్మారక యువజన ఉత్సవాలు జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఖమ్మం నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. దేశ స్వాతంత్ర సమరంలో యువతకు మార్గదర్శకులుగా నిలిచిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ల ఆశలను నేటి యువత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం, లౌకికత్వం, సమానత్వం కోసం పోరాటం చేశారని తెలిపారు.
AP సముద్ర జలాల్లోకి తమిళనాడు మత్స్యకారుల అక్రమ ప్రవేశంపై CM చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని అరికట్టాలని కోరుతూ TN సీఎం స్టాలిన్, కేంద్రానికి లేఖలు రాశారు. ఈ చొరబాట్ల వల్ల ఏపీలోని 162 గ్రామాల మత్స్యకారుల ఉపాధికి ముప్పు వాటిల్లి, ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్య రాకముందే నిబంధనలపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
జగిత్యాల జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి నిజమైన దిక్సూచిగా ‘ప్రజావాణి’ నిలిచిందని SE బీ. సుదర్శనం ఆదివారం తెలిపారు. వినియోగదారుల సమస్యలను సత్వరం పరిష్కరించాలనే సంకల్పంతో ప్రతి సోమవారం విద్యుత్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సర్కిల్, డివిజన్, సెక్షన్ స్థాయిలో వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడమే తమ లక్ష్యమన్నారు.
AKP: రోలుగుంట(మం) ఆర్ల పంచాయతీ గిరిజన గ్రామాల్లో విద్యుత్ బిల్లులు వివాదంగా మారాయి. కేవలం రెండు దీపాలు వినియోగిస్తున్నప్పటికీ రూ.25 వేల వరకు బిల్లులు రావడంతో పీటీజీ గిరిజనులు నిరసన వ్యక్తం చేశారు. బిల్లులు చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. బిల్లులను పునఃపరిశీలించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.
MDCL: అల్వాల్ పట్టణ పరిధి మచ్చ బొల్లారంలోని సర్వేశ్వరుని గుట్ట సర్వేశ్వరాలయంలో ఆదివారం గో ఆధారిత ఉత్పత్తులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గోసేవ శిక్షణ వర్గ్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పంచగవ్య వినియోగం, గో ఉత్పత్తుల తయారీ, టెర్రస్ గార్డెనింగ్పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గుమ్మడవెల్లి శ్రీనివాస్, యతేంద్ర, మనోజ్ తదితరులు ఉన్నారు.
SKLM: ఆమదాలవలస(మం) నెల్లిపర్తిలో సన్రైజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. డా.బొడ్డేపల్లి సురేష్ పర్యవేక్షణలో సుమారు 250 మందికి బీపీ, షుగర్, కీళ్ల వాతం, థైరాయిడ్, గుండె సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సీజనల్ జ్వరాలు, వడదెబ్బ వంటి అంశాలపై అవగాహన కల్పించారు.
VZM: ఎస్.కోట పోలీస్ స్టేషన్ను ఎస్పీ దామోదర్ ఆదివారం సందర్శించారు. సీడీ ఫైల్స్, లాకప్ రూమ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు స్టేషన్ సిబ్బంది గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీ.ఎస్.పీ గోవిందరావు, సీఐ వీఎన్ మూర్తి పాల్గొన్నారు.
మంచిర్యాల కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ కొండగట్టుకు పాదయాత్ర చేస్తూ బయలుదేరారు. ధరణి మధుకర్ ఇటీవల హనుమాన్ దీక్షను స్వీకరించారు. దీంతో ఆదివారం ఆయన హనుమాన్ భక్తులతో కలిసి పాదయాత్రగా కొండగట్టుకు బయలుదేరి వెళ్లారు. అంతకు ముందు స్థానిక దేవాలయాల్లో మేయర్ మధుకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా దేవాలయాల నిర్వాహకులు ఆయనను సన్మానించారు.
VSP: ఈస్ట్ కోస్ట్ రైల్వే 275 మిలియన్ టన్నుల సరుకు లోడింగ్ లక్ష్యాన్ని గడువుకు 11 రోజుల ముందే చేరుకుని కొత్త రికార్డు సృష్టించిందని డీఆర్ఎం లలిత్ బోరా ఆదివారం తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే 10.4% వృద్ధి నమోదు చేసింది. మార్చి 21 నాటికి 250 మిలియన్ టన్నుల అన్లోడింగ్ను కూడా పూర్తి చేసి మరో మైలురాయిని సాధించింది.