NDL: డోన్ జాతీయ రహదారిపై జగదుర్తి సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో కర్ణాటక కు చెందిన ప్రమోద్ గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన కర్నూలు మెడికోవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి శనివారం ఆసుపత్రికి పెళ్లి బాధితుడిని పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ప్రమోద్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.
BHPL: చిట్యాల మండలం గిద్దెముత్తారం అందుకుతండా గ్రామాల్లో మొబైల్ నెట్వర్క్ పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో ఫోన్ మాట్లాడాలంటే ఇళ్ల పైకప్పుల పైకి ఎక్కాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, టెలికాం సంస్థలు తక్షణమే టవర్లు ఏర్పాటు చేసి నెట్వర్క్ సమస్యను పరిష్కరించాలన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం పీఎం శ్రీ జిల్లాస్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఈఓ భోజన్న ప్రారంబించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటూ క్రీడల్లో రాణించాలని అన్నారు. జిల్లాలోని ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
E.G: పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ & మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పేర్కొన్నారు. శనివారం ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో నిర్వహించిన NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పురపాలక సంఘం కార్యాలయంలో చైల్డ్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి అధ్యక్షతన నగర కమిషనర్ బాలకృష్ణ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 15 అజెండాలను ప్రవేశపెట్టారు. 15 అజెండాలను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. స్థానిక సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు.
W.G: రాష్ట్రంలో స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. తణుకు మండలం తేతలి గ్రామ శివారు కొండాయపాలెం గ్రామంలో శనివారం స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే రాధాకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు.
TG: HYD కింగ్ కోఠి దవాఖానలో మంత్రి దామోదర రాజనర్సింహ లాంఛనంగా ప్రారంభించారు. ప్రైవేటు ఆస్పత్రిలో దాదాపు రూ. 5వేల వరకు ఖరీదు చేసే గార్డాసిల్-4 వ్యాక్సిన్ ను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయనుంది. ఈ వ్యాక్సిన్ ను సింగిల్ డోస్ కింద ఎడమ చేతికి వేస్తారు. వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎడమ చేతి చూపుడు వేలికి మార్కర్ ఇంక్ పెడతారు. యూ-విన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
సత్యసాయి: పరిగి మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్న సందర్భంగా మనేసముద్రం గ్రామ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న రైతు చౌడప్పకు చెందిన మల్బరీ తోటను మంత్రి సవిత శనివారం పరిశీలించారు. రైతుతో మాట్లాడి పంట దిగుబడి, పెట్టుబడి–రాబడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మల్బరీ సాగులో ఎదురవుతున్న సమస్యలను కూడా వివరంగా తెలుసుకున్నారు.
VZM: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ, వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లా పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. విజయవాడ నుంచి వాయుమార్గంలో చీపురుపల్లి మండలం రావివలస వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంఛార్జి మంత్రి సీఎంకు స్వాగతం పలికారు.
TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇంటర్ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ మైనర్ విద్యార్థి టాయ్లెట్లో మృత శిశువుకు జన్మనిచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక, పరీక్షా కేంద్రంలోని మరుగుదొడ్డిలో మృత శిశువుకు జన్మనిచ్చింది.
VKB: మోమిన్పేట్ మండలంలో నివాసం ఉండే రహుఫ్ అనే వ్యక్తిపై తన బంధువులు వారసత్వపు భూతగాదాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం 3 గంటలకు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో రహుఫ్కు బలమైన గాయం తగలడంతో సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటిల్ తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి HYD తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లలో బెంగాల్ ముర్షిదాబాద్కు చెందిన కోహితూర్ మామిడి ఒకటి. అత్యంత సున్నితంగా ఉండే ఈ మామిడి పండ్లను దూదిలో భద్రపరిచి అమ్ముతారు. మార్కెట్లలో ఒక్కో మామిడి పండు ధర ఏకంగా రూ.1,500 వరకు ఉంటుంది. అద్భుతమైన రుచి, ప్రత్యేకతలు కలిగిన ఈ పండు.. మామిడి ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ATP: కళ్యాణదుర్గం నుంచి బొమ్మగానిపల్లి వరకు 3.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించే తారు రోడ్డు పనులకు ఎమ్మెల్యే సురేంద్ర బాబు భూమిపూజ చేశారు. గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడితే, కూటమి ప్రభుత్వం అభివృద్ధి బాటలు వేస్తోందని ఆయన అన్నారు. 143 చెరువులకు నీరు, రిజర్వాయర్ల సాధనపై మార్చి 4న సీఎంను కలుస్తామని తెలిపారు.
BDK: భద్రాచలం రామాలయంలో తయారవుతున్న జైశ్రీరామ్ పేరు గల ఇటుకలను ఆదివారం నుంచి విక్రయించనున్నారు. ఇంటి నిర్మాణంలో తొలి ఇటుకగా వాడితే శుభం కలుగుతుంది. ఒక్కో ఇటుక ధర రూ. 60 ఉంటుందని అంచనా. ఇసుక, మట్టి, సిమెంట్ మిశ్రమంతో ఇవి తయారవుతున్నాయి. ఒక్కోటి సుమారు 2 కిలోల బరువు ఉంటుంది. ఈ ఇటుకలను చిత్రకూట మండపం సమీపంలో భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా, మామిడి రైతులు ఏటా కష్టాలు తప్పడం లేదు. ఆశించిన మేర ధరలు ఉండటం లేదు. మామిడి బోర్డు, టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని ఏటా ఎన్నికల్లో నాయకులు హామీ ఇస్తున్నారు. గెలిచిన తర్వాత పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.