SDPT: చిన్నకోడూరులోని గంగమ్మతల్లికి 24వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మంగళ హారతులు సమర్పించనున్నట్లు గంగపుత్ర సంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి పూజ, అమ్మవారికి అభిషేకం, భక్తులకు ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు.
MDCL: ఉగాది పండుగను పురస్కరించుకుని అల్వాల్లోని శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరం ‘పరాభవ’ నామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని అర్చకులు స్వామివారికి అభిషేకాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో మార్మోగింది.
BDK: దమ్మపేట(M) గండుగులపల్లికి చెందిన తాటి కృష్ణకుమారి ప్రసవ వేదనలతో బాధపడుతుండగా 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే దమ్మపేట 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రసవ వేదనలు ఎక్కువ కావడంతో అంబులెన్స్లోనే ఆమెకు ప్రసవం చేశారు. ఆడ్డ బిడ్డకు జన్మనించింది. మెరుగైన చిక్సిత కోసం ఆసుపత్రికి తరలించారు.
కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ఊపందుకుంటోంది. సీపీఎం వెటరన్ నేత, సీఎం పినరయి విజయన్ కన్నూరు జిల్లా ధర్మదం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశారు. ఉదయం 11 గంటలకు తలస్సేరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి సీఎం చేరుకున్నారు. ఆయనకు కన్నూరు రిజిస్ట్రార్ ఎబీ సత్యన్ స్వాగతం పలికారు. అనంతరం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి పినరయి విజయన్ అందజేశారు.
MBNR: పాలమూరు యూనివర్సిటీలో మార్చి 17, 18 తేదీలలో నిర్వహించిన SFI రాష్ట్ర యూనివర్సిటీల కన్వెన్షన్లో పాలమూరు యూనివర్సిటీకి చెందిన బత్తిని రాము రాష్ట్ర యూనివర్సిటీల కో-కన్వీనర్ గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బత్తిని రామును యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు అభినందించారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.
SKLM: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాలకు అరటి ఎగుమతులు నిలిచిపోవడంతో శ్రీకాకుళం జిల్లాలోని అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కేవలం రెండు వారాల్లోనే అరటి టన్ను ధర రూ. 20-23వేల నుంచి రూ. 6-8వేలకు పడిపోయింది. స్థానికంగానూ వ్యాపారులు కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని అరటి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
SRD: పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాంట్రాక్ట్ కార్మికులకు నెలకు రూ.26 వేల రూపాయల వేతనం చెల్లించాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు మల్లేశం డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సుందరయ్య భవన్లో గురువారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. జిల్లా కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.
KMM : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలోని శ్రీ కామాక్షి ఏకామేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
MNCL: తల్లిదండ్రులు మందలించారని విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన బెల్లంపల్లిలో చోటుచేసుకుంది. 2-టౌన్ ఎస్సై కిరణ్ కుమార్ వివరాల ప్రకారం.. సుభాష్ నగర్కు చెందిన వర్షిత తన స్నేహితులకు డబ్బులు అప్పుగా ఇచ్చింది. దీంతో ఇంట్లో చెప్పకుండా డబ్బులు అప్పు ఇవ్వడం ఏంటని తండ్రి మందలించాడు. మనస్తాపానికి గురైన వర్షిత ఇవాళ ఉరేసుకుని మృతి చెందింది. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.
MNCL: కాసిపేట మండలం, కొండాపూర్ యాప వద్ద బీజేపీ నాయకులు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ధర్మారావుపేట గ్రామానికి చెందిన మండలంలోని తొలి బీజేపీ వార్డు మెంబర్ ముత్యాల నవీన్ కుమార్ యాదవ్ ఉగాది పండుగను పురస్కరించుకుని ఉగాది పచ్చడిని అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. ఈ పరాభవ నామ సంవత్సరం అందరికి సుఖ సంతోషాలను కలిగించాలని ఆకాంక్షించారు.
PPM: పార్వతీపురం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డాక్టరు ఎన్. ప్రభాకరరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పట్టణ అభివృద్ధిపై కీలక దిశ నిర్దేశం చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఆనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ ప్రాథమిక లక్ష్యం అన్నారు.
విశాఖ జర్నలిస్ట్స్ ఫోరమ్ (APWJF) అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక ఉగాది పురస్కారాన్ని ప్రకటించింది. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. మీడియా రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది. పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
NTR అభిమానులకు ఉగాది వేళ గుడ్ న్యూస్. NTR పుట్టినరోజు (మే 20) సందర్భంగా ఆయన స్టైలిష్ యాక్షన్ మూవీ ‘ఊసరవెల్లి’ని రీ-రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలోని తారక్ మ్యానరిజమ్స్, సాంగ్స్ అప్పట్లో సెన్సేషన్. ఇప్పుడు మళ్లీ వెండితెరపై ‘టోనీ’ మ్యాజిక్ చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధం కానున్నారు.
KRNL: కోసిగి పట్టణంలో రూ.2.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రాలయం TDP ఇంఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి నేడు భూమిపూజ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి చింతకుంట రోడ్ రంగప్పగట్టు వరకు రూ.కోటితో CC డ్రైన్, వివిధ కాలనీలలో రూ.85 లక్షలతో CC రోడ్లు, సజ్జలగుడ్డం రోడ్ నుంచి మోడల్ స్కూల్ వరకు రూ.30 లక్షలతో CC రోడ్ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.
సత్యసాయి: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా పెనుకొండలోని నివాసంలో మంత్రి సవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యం సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి పంచాంగ శ్రవణం విని, రాశి ఫలాలను తెలుసుకున్నారు. నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు.