కేంద్ర ప్రభుత్వం జనగణన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. సహజీవ జంటలకు కుటుంబ హోదా ఇవ్వనుంది. చాలా కాలంగా కలిసి ఉంటున్న వారిని ఇకపై ఒకే కుటుంబంగా గుర్తించాలని నిర్ణయించింది. మొబైల్ యాప్ ద్వారా ఇంటింటికీ వెళ్లి ఇళ్ల వివరాలు సేకరించాలని అధికారులకు సూచించింది. తొలిసారిగా స్వయంగా వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. 33 ప్రశ్నలతో ప్రశ్నావళి తయారు చేశారు.
KDP: ఒంటిమిట్టలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఒంటిమిట్ట, రేణిగుంట రహదారులపై ఈ మార్పులు ఉంటాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 ఉదయం 9 గంటల నుంచి ఏప్రిల్ 2 ఉదయం 8 గంటల వరకు మళ్లింపు కొనసాగుతుంది.
NLG: ఢిల్లీలో జరిగిన ‘టీఈహెచ్ బజార్’ ఎగ్జిబిషన్లో తెలంగాణ చేనేత కళా వైభవం చాటిచెప్పారు. పుట్టపాక గ్రామానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత ఆనంద నాగరాజు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రసిద్ధ తేలియా రుమాల్తో పాటు సింగిల్, డబుల్ ఇక్కత్ వస్త్రాలను ఆయన ప్రదర్శించారు. మన సంప్రదాయ కళకు ఢిల్లీ వేదికగా దక్కిన ఈ గౌరవంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
AP: నక్సల్స్ ఫ్రీ స్టేట్గా ఏపీ మారిందని డీజీపీ హరీష్ గుప్తా తెలిపారు. 9 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. దళంతో కలిసి కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణరావు అలియాస్ సోమన్న లొంగిపోయాడని, ప్రభుత్వం తరఫున అన్ని రకాల బెనిఫిట్స్ అందిస్తామన్నారు. నారాయణరావుకు రూ.25 లక్షలు ప్రభుత్వం నుంచి అందిస్తున్నామని, మిగితా మావోయిస్టులకు రూ.24.20 లక్షలు ఇచ్చినట్లు వెల్లడించారు.
ASF: పిల్లలు సరదా కోసం చెరువులు, కాలువలకు ఈతకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్ సూచించారు. మధ్యాహ్నం వేళల్లో పిల్లల కదలికలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచించారు. కచ్చితంగా పెద్దల పర్యవేక్షణలోనే ఈతకు వెళ్లేలా చూడాలని SP కోరారు.
MBNR: నవాబుపేట మండలంలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం మాదకద్రవ్యాల నిరోధంపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ఎస్సై విక్రం తెలిపారు. ఈగల్ టీం ఆధ్వర్యంలో ‘పిల్లల భద్రత-డ్రగ్స్కు అడ్డుకట్ట’ అంశంపై నవాబుపేట, చౌడూరు, యన్మన్ గండ్ల, కొల్లూరు గ్రామాల్లో కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు.
NLG: చిట్యాల పట్టణ కేంద్రంలో చిట్యాల భువనగిరి రోడ్డుపై సిఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్ల రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనం 18 వేలకు పెంచారని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఆశా వర్కర్లకు న్యాయం చేయాలన్నారు.
రోహిత్ శర్మ ఫామ్పై ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేల జయవర్ధనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ ఈ సీజన్లో చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నాడని తెలిపాడు. ప్రాక్టీస్ క్యాంప్ మొదటి రోజు నుంచే జట్టుతో చేరి, పూర్తి ఏకాగ్రతతో సాధన చేశాడని పేర్కొన్నాడు. ప్రస్తుతం రోహిత్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడని, KKRతో అతడు ఆడిన ఇన్నింగ్స్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని వ్యాఖ్యానించాడు.
JGL: కథలాపూర్ మండలంలోని సిరికొండలో ట్రాన్స్కో ఆధ్వర్యంలో ‘విద్యుత్ ప్రజా బాట’ కార్యక్రమం నిర్వహించారు. ఏఈ దివాకర్ రావు మాట్లాడుతూ.. విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, వైర్లు తెగితే సొంతంగా మరమ్మతులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ఈ మేరకు సిబ్బందితోనే పనులు చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇంజనీర్, సిబ్బంది పాల్గొన్నారు.
SRCL: ప్రైవేటు కళాశాలల SC, ST, BC, EBC విద్యార్థిని విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వి.రవీందర్ రెడ్డి తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో సోమవారం ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో ఏప్రిల్ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
SDPT: ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే అక్రమ అరెస్టులు చేయడం సిగ్గుచేటని టీయూ జేఏసీ దుబ్బాక నియోజకవర్గ ఛైర్మన్ సూకురి లింగం అన్నారు. అసెంబ్లీ ముట్టడికి యత్నిస్తారనే నేపథ్యంలో ముందస్తుగా లింగంతో పాటు మల్లుపల్లి భూపతి గౌడ్ తదితరులను అదుపులోకి తీసుకొని మిరుదొడ్డి పోలీస్ స్టేషన్కు తరలించారు. వారు మాట్లాడుతూ.. ప్రజా పాలన అంటే రాత్రికి రాత్రే అరెస్టుల? అని ప్రశ్నించారు.
RR: ఫరూఖ్ నగర్ మండలం దూసకల్ గ్రామంలోని 6వ వార్డులో రూ.5 లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధే ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతిర్మయి అంజి, గ్రామస్తులు పాల్గొన్నారు.
చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. బాధితుల సమస్యలను కలెక్టర్ సుమిత్ కుమార్ తెలుసుకుంటున్నారు. వారి వినతి పత్రాలు పరిశీలించి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఆదర్శ రాజేంద్రన్, అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పాడేల్, డీఆర్వో మోహన్ పాల్గొన్నారు.
E.G: కడియం మండలం కడియపులంక శ్రీ హరిహర మహా క్షేత్రంలో కొలువైయున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికలో కళ్యాణాన్ని పండితులు శాస్త్రక్తంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ మార్గాన్ని సత్యనారాయణ లక్ష్మి దంపతులు సంప్రదాయంగా పట్టు వస్త్రాలను సమర్పించారు.
VKB: దోమ మండల పరిధిలోని మోత్కూరు గ్రామపంచాయతీ ఎస్సీ కాలనీలో అంబేద్కర్ యువజన సంఘం సోమవారం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షుడిగా గట్టు రాజశేఖర్, గౌరవ అధ్యక్షుడిగా గుద సురేష్ ఎన్నికయ్యారు. కమిటీ సభ్యులుగా గూనిగారి అంజలి, ఆదిత్య శ్రీనివాస్, సండి శ్రీనివాస్, ఎర్ర రవీందర్, బైండ్ల నర్సింలు బాధ్యతలు చేపట్టారు.