ప్రకాశం: కంభం మండలంలోని జంగంగుంట్ల గ్రామ సమీపంలో గల జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గొర్రెల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 గొర్రెలు మృతిచెందగా.. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో సుమారు రూ.6 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. వర్షం కారణంగా రహదారి కనిపించక ప్రమాదం జరిగినట్లు బస్సు డ్రైవర్ తెలిపాడు.
VZM: స్దానిక ZP సమావేశ మందిరంలో సోమవారం మద్యాహ్నం 2 గంటలకు P4 కార్యక్రమం కింద VZM నియోజకవర్గ స్థాయి వార్షికోత్సవం నిర్వహించనున్నట్లు ZP CEO బి.వి.సత్యనారాయణ ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ పురోగతి, విజయాలు, భవిష్యత్ కార్యాచరణలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో MLA అదితి గజపతి రాజా పాల్గోననున్నారని ఆయన పేర్కొన్నారు.
CTR: జిల్లాలోని 621 పంచాయతీల్లో ఈ ఆర్థిక సంవత్సరం పన్నుల వసూలు లక్ష్యం రూ.24.14 కోట్లు కాగా.. ఇప్పటి వరకు రూ.22.83 కోట్లు వసూలు చేసినట్లు జిల్లా పంచాయతీ అధికారి సుధాకర్ రావు తెలిపారు. 100% లక్ష్యాలను చేరుకునేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. పన్నుల వసూలు లక్ష్యం చేరుకునేలా తప్పనిసరిగా కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించినట్టు ఆయన వెల్లడించారు.
అన్నమయ్య: పీలేరు బండ్లవంక ప్రాంతా నికి చెందిన వంశీకృష్ణ(32) ఎలక్ట్రిషియన్.అతడు MNR కల్యాణ మండపంలో జరిగే వివాహ వేడుకలకు ఆదివారం విద్యుదీపాలంకరణ పనులకు వెళ్లాడు.అక్కడ విద్యుత్తు వంశీకృష్ణ స్తంభాన్ని ఎక్కి పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కింద పడిపోయాడు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అతడు అప్పటికే మృతి చెందాడన్నారు.
NLR: బుచ్చి సీఐ శ్రీనివాసరావు ఆకతాయిల ఆట కట్టించారు. ఆదివారం రాత్రి నిబంధనలకు విరుద్ధంగా బైక్లకు సైలెన్సర్లు బిగించుకుని హల్చల్ చేస్తున్న వారిపై చర్యలకు ఉపక్రమించారు. సైలెన్సర్ను నిర్వీర్యం చేయించి యువకుడి తలపై పెట్టి మరోసారి ఇటువంటి తప్పు చేయనని ప్రమాణం చేయించారు. ఎవరైనా సైలెన్సర్లు వినియోగిస్తే, ఇదేవిధంగా పట్టణంలో ఊరేగిస్తామని సీఐ హెచ్చరించారు.
WGL: వరంగల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్లో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదలైంది. ఎంటెక్, పీహెచ్డీ, ఎంబీఏ, ఎంఏ ఇన్ ఇంగ్లిష్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానించారు. పీహెచ్డీకి ఏప్రిల్ 18, ఇతర కోర్సులకు ఏప్రిల్ 25 వరకు గడువు ఉంది. GATE, NET లేదా ఇన్స్టిట్యూట్ ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
KMR: మద్నూర్ ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో నేటి నుంచి శనగ కొనుగోలు చేయనున్నారు. తీసుకోవలసిన జాగ్రత్తలు… ఎకరాకు ఏడు క్వింటాళ్లు. ఒక రైతు 40 క్వింటాళ్లు అమ్మకానికి పరిమితి. పంట 14 శాతం తేమ మించకూడదు. పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఏఈవో దగ్గర ధ్రువీకరణ పత్రంతో పంట అమ్మకానికి తీసుకుని రావాలని సొసైటీ అధికారులు వివరించారు.
TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోసం అధిష్టానం పంపిన నిధులు దుర్వినియోగమైనట్లు బీజేపీ నాయకత్వం ఒక అంచనాకు వచ్చిందట. పార్టీ పంపిన ఫండ్స్ పూర్తిస్థాయిలో అభ్యర్థులకు చేరలేదని, మధ్యలో ఆయా జిల్లాల అధ్యక్షులు సగానికి పైగా ‘స్వాహా’ చేశారని గుర్తించందట. పలు రకాల సమీక్షల అనంతరం అగ్రనేతలు ఈ అంచనాకు వచ్చారట. దీంతో ఫండ్స్ స్వాహా చేసిన వారిపై చర్యలు తీసుకోనుందట.
KRNL: ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ గుప్తా ఒక ప్రకటనలో చెప్పారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒకేషనల్ జూనియర్ కాలేజీలో జాబ్మేళా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. జాబ్మేళాలో 16 కంపెనీలు పాల్గొంటున్నాయి. మొత్తం 1110 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. నిరుద్యోగులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
SRCL: కొనరావుపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన అనుముల బాలవ్వ అనారోగ్యంతో నిమ్స్లో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చికిత్స అందేలా ప్రభుత్వం నుండి రూ.2 లక్షల 50 వేల రూపాయలు వైద్య ఖర్చుల కోసం వెంటనే ఎల్వోసీ మంజూరు చేయించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఆది శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు.
WGL: జిల్లాలో మూడు నెలల బియ్యం పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. MLS పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు బియ్యం తరలింపు ప్రారంభమైంది. సుమారు 509 షాపులకు సరఫరా జరుగుతోంది. నెలవారీ 5,594.26 మెట్రిక్ టన్నుల బియ్యం స్థానంలో మూడు నెలలకు కలిపి 16,858.94 మెట్రిక్ టన్నులు పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో 2,95,442 రేషన్ కార్డులు, 8,92,330 లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
NZB: చిన్నారుల ఆరోగ్యమే పరమావధిగా ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న సుమారు 3,120 అంగన్వాడీ కేంద్రాల్లో త్వరలోనే ‘తొలి ముద్ద’ పథకం ద్వారా పౌష్టికహరంతో కూడిన అల్పాహారాన్ని అందించనుంది. ఈ నిర్ణయంతో దాదాపు 1.50 లక్షల మంది చిన్నారులకు ప్రయోజనం చేకూరనుంది.
సత్యసాయి: పెనుకొండ అభివృద్ధిలో భాగంగా మెడికల్ కళాశాల సమీపంలో 27 ఎకరాల్లో అహుడా ఎన్టీఆర్ ఎంఐజీ లేఅవుట్కు మంత్రి సవితమ్మ, అహుడా చైర్మన్ టి.సి.వరుణ్ శంకుస్థాపన చేశారు. రూ.16.6 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ లేఅవుట్లో మధ్యతరగతి కుటుంబాల కోసం 292 ఫ్లాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక్కడ అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.
NDL: బేతంచర్ల పట్టణానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి సోమవారం రానున్నారని టీడీపీ పట్టణ అధ్యక్షురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి తెలిపారు. ఉదయం 10 గంటలకు పట్టణంలోని శేషారెడ్డి కాలనీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20 నెలల సమయంలోనే పేదలకు నిర్మించిన గృహప్రవేశాలకు ఎమ్మెల్యే హాజరవుతారన్నారు. శేషారెడ్డి పాఠశాలకు ఎదురుగా సీసీ రోడ్డుకు భూమి పూజ చేస్తారని పేర్కొన్నారు.