విశాఖ జుపార్కుకి అరుదైన బ్లాక్ పాంథర్ వచ్చి చేరింది. అస్సాం స్టేట్ జూ పార్కుతో జంతు మార్పిడి కార్యక్రమంలో భాగంగా పలు జంతువులను ఇక్కడకు తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దాదాపు 40 ఏళ్ల తర్వాత ఆడ బ్లాక్ పాంథర్ను తీసుకురావడం విశేషం. అస్సాం నుంచి వచ్చిన అడవి మగ చిరుత, జంతువుల జన్యుపరమైన వైవిధ్యాన్ని పెంచుతుందని అధికారులు తెలిపారు.
ADB: బోథ్ మండలంలోని కరత్వాడలో చిరుతపులి కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు గంగయ్యకు చెందిన ఆవుపై చిరుత దాడి చేసి హతమార్చింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించగా, గురువారం తెల్లవారుజామున 5 గంటలకు ఈ దాడి జరిగినట్లు గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
AKP: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని వైసీపీ శ్రేణులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. మునగపాక క్యాంపు కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ పాల్గొన్నారు.
JN: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM Surya Ghar Muft Bijli Yojana ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ రాయితీ పథకాలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.
KMM: వెంకటపాలెం గంజాయి స్మగ్లింగ్ కేసులో నిందితులకు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ. 2 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2021 ఏప్రిల్ 7న వెంకటపాలెం వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా, ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న 194 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి, నేరం నిరూపితం కావడంతో శిక్ష విధించింది.
TG: రాష్ట్రంలో ఇవాళ ‘ప్రజా ప్రభుత్వం-ప్రగతి ప్రణాళిక’ అనే భారీ కార్యక్రమానికి సర్కార్ శ్రీకారం చుట్టనుంది. ఇవాళ్టి నుంచి జూన్ 12 వరకు మొత్తం 99 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. గత రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను, సంక్షేమ పాలనను ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లడమే దీని ప్రధాన లక్ష్యం. ఇందుకోసం ప్రభుత్వం 10 ప్రత్యేక థీమ్లతో పక్కా కార్యాచరణను రూపొందించింది.
PDPL: ప్రతి పౌరుడికి ఆధార్ అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆధార్ అప్డేషన్ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రతి విద్యార్థి అప్డేట్ ఆధార్ కార్డు కలిగి ఉండాలని, అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కార్డు లేని విద్యార్థులకు అందేలా చూడాలని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ఆధార్ కార్డు లేని వ్యక్తులను గుర్తించి, కార్డు జారీ చేయాలన్నారు.
TPT: తిరుపతిలో రేణిగుంట రోడ్డులోని జూడియో షోరూమ్ వద్ద రోడ్డు దాటుతున్న మహిళను స్కూల్ బస్సు ఢీకొనడంతో గురువారం సాయంత్రం మృతి చెందింది. స్కూల్ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు రుయా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె వద్ద ఏలాంటి ఫోటో గుర్తింపు ఆధారాలు లేవని అలిపిరి పోలీసులు తెలిపారు.
W.G: అసంపూర్తిగా ఉన్న రైతు సేవా కేంద్రాలను పూర్తి చేయాలని శాసన మండలి సభ్యులు వంక రవీంద్ర నాథ్ డిమాండ్ చేశారు. గురువారం శాసన మండలిలో ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించి 2020 మే నెల 30న ప్రారంభించి అప్పటి కేంద్ర ప్రభుత్వంతో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేశారు.
అన్నమయ్య: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి రాయచోటి పట్టణంలోని రింగ్ రోడ్ నూర్ మసీదు వద్ద యూసుఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రంజాన్ నెలలో జరిగే ఇఫ్తార్ విందులు ఆత్మీయత, సహృద్భావాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
MBNR: అర్హులైన ప్రతి పేదవాడి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సతీమణి కవిత పేర్కొన్నారు. కొత్తూరులో గురువారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న పేదల కష్టాలను గుర్తించి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.
ఇటీవల మలయాళ చిత్రం ‘సర్వం మాయ’లో ప్రీతి ముకుందన్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె బాలీవుడ్లోకి అడుగుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కార్తిక్ ఆర్యన్ ‘నాగ్జిల్లా’ సినిమాలో ఆమె నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సినిమాలోని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేసినట్లు సమాచారం. మృగ్దీప్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కోనసీమ: అర్ధరాత్రి, తెల్లవారుజామున జరిగే రహదారి ప్రమాదాలను అడ్డుకునేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్నంగా స్పందించింది. అమలాపురంలో గురువారం రాత్రి నిద్రమత్తు వల్ల తలెత్తే ముప్పును తప్పించేందుకు లారీలు, బస్సులు, కార్ల డ్రైవర్లను అప్రమత్తం చేస్తూ పంపుతున్నారు. పోలీసుల ఈ చొరవతో ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.
VZM: గరివిడి మండలం దుమ్మెద గ్రామంలో కోనూరు స్కూల్ ఉపాధ్యాయులు గురువారం సాయంత్రం డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం.. విద్యార్థులను చేర్పిద్దాం అంటూ తల్లిదండ్రులకు అవగాహనపరిచారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు తల్లిదండ్రుల భారం తగ్గిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు వెంపడాపు రమణమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
KDP: వేంపల్లి (M)లోని బక్కన్నగారి పల్లెకు చెందిన రైతు రెడ్డి బోయిన సూర్యనారాయణ (30) అప్పుల బాధ తట్టుకోలేక గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు 2.50 ఎకరాల పొలం ఉండగా అరటి, మొక్కజొన్న, వేరుశనగ పంటలు సాగు చేసేవాడు. 5 బోర్లు వేసి రూ.12 లక్షలకు పైగా అప్పులు అయ్యాయి. పంటలకు దిగుబడి రాకపోవడం, గిట్టుబాటు ధరలు లేక చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.