AKP: స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని వైసీపీ శ్రేణులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పిలుపునిచ్చారు. మునగపాక క్యాంపు కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జేడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ పాల్గొన్నారు.