VZM: గరివిడి మండలం దుమ్మెద గ్రామంలో కోనూరు స్కూల్ ఉపాధ్యాయులు గురువారం సాయంత్రం డ్రైవ్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం.. విద్యార్థులను చేర్పిద్దాం అంటూ తల్లిదండ్రులకు అవగాహనపరిచారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు తల్లిదండ్రుల భారం తగ్గిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు వెంపడాపు రమణమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.