MHBD: కొత్తగూడ మండల విద్యార్థులకు మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. విద్యార్థుల ఉన్నత విద్య కోసం కొత్తగూడలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో కొత్తగూడ, గంగారం మండలాల పరిసర గ్రామాల విద్యార్థులకు సమీపంలోనే ఉన్నత విద్య అందుబాటులోకి రానుంది. ఈ సందర్భంగా మండల ప్రజలు, విద్యార్థులు సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు.
సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల తమిళ లెజెండ్ MGRపై చేసిన వ్యాఖ్యల పట్ల హీరో విశాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. కాంతారావుని పొగడటం కోసం, తమిళ ప్రజల ఆరాధ్య దైవం, లెజెండరీ నటుడు MGRని తక్కువ చేయడం సరికాదని ట్వీట్ చేశాడు. ఒక లెజెండ్ను గౌరవిస్తూనే మరో మహానుభావుడిని అవమానించడం బాధాకరమని, ఈ విషయంలో రాజేంద్ర ప్రసాద్ స్పష్టతనిస్తూ క్షమాపణలు చెప్పాలని విశాల్ కోరాడు.
MLG: వేసవి కాలంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని MLG జిల్లా కలెక్టర్ దివాకర్ అధికారులకు ఆదేశించారు. ఇవాళ ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. తాగునీటి సమస్యకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు.
VSP: వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆరిలోవ 11వ వార్డు బాలాజీ నగర్లో ఇవాళ వార్డు అధ్యక్షుడు ముగడ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మహా విశాఖ మాజీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ కోట్లాది అభిమానుల పార్టీగా ఎదిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో ‘ప్రజా పాలన – ప్రగతి పాలన’ 99 రోజుల కార్యాచరణపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత, MLA కోవ లక్ష్మి, MLC విఠల్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించిన ప్రణాళికను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసి ప్రజలకు మేలు చేకూర్చాలని కోరారు.
UPSC సివిల్స్ ఇంటర్వ్యూలలో రిజర్డ్వ్ కేటగిరీ అభ్యర్థులకు తక్కువ మార్కులు వేస్తున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మెయిన్స్లో టాపర్లుగా ఉన్నా, ఇంటర్వ్యూలో అన్యాయం జరుగుతోందని కొందరు ఆరోపిస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఒక అభ్యర్థికి 275కి కేవలం 60 మార్కులే వచ్చిన వైనాన్ని ఉదాహరిస్తున్నారు. బోర్డు మాత్రం ప్రతిభ ఆధారంగానే మార్కులు వేస్తామంది.
ATP: బుక్కరాయసముద్రం మండలం సిద్దారంపురం గ్రామంలో ఈ నెల 14న నిర్వహించనున్న చెక్కభజన గజ్జెల పూజకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రామలింగారెడ్డి ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమ ఖర్చుల కోసం ఆయన రూ.20 వేలను నిర్వాహకులకు అందజేశారు. గ్రామీణ కళలను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతని పేర్కొన్నారు. కార్యక్రమంలో గురువు లక్ష్మినారాయణ పాల్గొన్నారు.
ప్రతిపక్షాలు మాట్లాడితేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. తనపై అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో.. సభలో మాట్లాడేందుకు అందరికీ సమాన అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, సభా నియమాలకు కట్టుబడే పనిచేస్తున్నామన్నారు. స్పీకర్ పదవి ఏ ఒక్కరికో సొంతం కాదని, పార్లమెంటు 140 కోట్ల మంది దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు.
CTR: వైసీపీ 16వ ఆవిర్భావ వేడుకలు నగరిలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రోజా పాల్గొన్నారు. మాజీ సీఎం వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె ఘన నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. గత 15 ఏళ్లుగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీ అలుపు లేని పోరాటం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
SRCL: ఇల్లంతకుంట మండలంలో గురువారం ఉదయం ప్రైవేట్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట పొలంలోకి దూసుకెళ్లింది. వెంకటాపూర్ నుంచి జంగంరెడ్డిపల్లెకు విద్యార్థులతో వెళ్తుండగా డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదు.
ADB: గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని MLA అనిల్ జాదవ్ అన్నారు. గురువారం పట్టణంలోని రెవెన్యూ గార్డెన్లో నిర్వహించిన ప్రగతి పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా సర్పంచులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో MLA పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా తదితరులున్నారు.
వేసవిలో శరీరం తరచూ అలసట, డీహైడ్రేషన్కు గురవుతుంది. వీటిని తగ్గించి శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలోని పొటాషియం, మెగ్నీషియం వల్ల బీపీ అదుపులో ఉండి, కిడ్నీలో రాళ్లు తగ్గుతాయి. ఇంకా శరీర వేడిని తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు కొబ్బరి నీళ్లు తీసుకోవడం ఉత్తమం.
KMM: సత్తుపల్లి(M) నారాయణపురం ఆంజనేయస్వామి ఆలయం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రేజర్లకు చెందిన సాలి నాగేశ్వరరావు (58), పెనుబల్లి(M) పానెం సులోమన్(57) వేర్వేరు బైక్లపై సత్తుపల్లి వైపు వస్తుండగా.. బేతుపల్లి నుంచి వస్తున్న లారీ టర్నింగ్ వద్ద వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TG: LPG కొరతపై ప్రధాని మోదీ మాట్లాడటం లేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ అన్నారు. పశ్చిమాసియా యుద్ధంపై పార్లమెంట్లో ఎందుకు చర్చించరని ప్రశ్నించారు. LPG సమస్యను కేంద్రం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం మోదీ అజెండాగా మారిందని విమర్శించారు. ట్రంప్ చర్యలను మోదీ ఎందుకు వ్యతిరేకించడం లేదని నిలదీశారు.
JN: దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక ఉచిత టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువుల ఆరోగ్యం రైతులకు ఎంతో ముఖ్యమని, టీకాలు వేయించడం ద్వారా గాలికుంటు వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్య అధికారి డా. సింధు ప్రియతో పాటు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.