VZM: గజపతినగరంలోని శ్రీ సీతారామస్వామి దేవాలయాల ప్రాంగణంలో శుక్రవారం సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద పండితులు ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరిపారు. సీనియర్ న్యాయవాది ఉప్పలపాటి రమేష్ దంపతులతో పాటు పలువురు కళ్యాణాన్ని జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సన్నివేశాన్ని ఆసక్తిగా తిలకించారు.
NLR: దగదర్తి మండలం చౌట పుత్తెడు వెళ్లే రోడ్డు పెద్ద పెద్ద గుంతలు పడి అధ్వానంగా తయారయ్యిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ రోడ్డుపై ప్రయాణం నరక ప్రాయంగా ఉందంటున్నారు. బైకులు, ఆటోలపై ప్రయాణం చేయాలంటే వాహనాలు పాడవుతున్నాయనీ ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించాలని గ్రామ ప్రజలు పేర్కొన్నారు.
AP: ఇంటర్ పరీక్షల వాల్యుయేషన్ను ఏప్రిల్ 10-14 మధ్య పూర్తి చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 21లోపు ఫలితాలను వెల్లడించనున్నట్లు సమాచారం. మే మొదటి వారంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉంది. కాగా, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు దాదాపు 10.37 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
సినిమా రంగంలో మహిళల పోరాటంపై సమంత చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తమ గుర్తింపు కోసం స్త్రీలు రెట్టింపు కష్టపడాలని, ఇతరుల సౌకర్యం కోసం తమ అభిప్రాయాలను, ఆశయాలను త్యాగం చేయడం అలవాటుగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకనైనా ప్రతి చిన్న విషయానికి క్షమాపణలు చెప్పడం ఆపి, మహిళలు తమ వ్యక్తిత్వాన్ని చాటుకోవాలని గట్టిగా పిలుపునిచ్చింది.
KRNL: ధర్మానికి శ్రీరాముడు ఆదర్శంగా నిలిచి, సత్యం, న్యాయం, నీతి మార్గాలను సమాజానికి చూపించిన ఆయన చరితం నేటి సమాజానికీ మార్గదర్శకంగా నిలుస్తోందని నగరపాలక సంస్థ కమిషనర్ పీ. విశ్వనాథ్ తెలిపారు. శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా నగరంలోని పాతబస్తీ తెలుగు వీధిలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించిన శోభాయాత్రను కమిషనర్ ప్రారంభించారు.
కోనసీమ: శ్రీరామనవమి సందర్భంగా నిడదవోలు పట్టణం కాపుల వీధి నందు శ్రీ సీతాసమేత శ్రీ రామచంద్రమూర్తి స్వామి వారి 28వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సీతారాముల వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
E.G: శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని శ్రీరాముని దేవాలయాన్ని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సందర్శించారు. శుక్రవారం నిర్వహించిన స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలను వీక్షించి, ప్రత్యేక పూజల్లో ఎస్పీ దంపతులు పాల్గొన్నారు. ఆదర్శ పురుషుడు శ్రీరామచంద్రుని కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు.
ATP: రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన శ్రీ స్వయంభు జంబుకేశ్వర స్వామి బ్రహ్మోత్సవ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభించారు. అంకురార్పణ, రక్షా బంధనం కార్యక్రమంతో వేడుకలను ప్రారంభించినట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, పురోహితులు రామకృష్ణ తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్వామి వారు సూర్యప్రభ వాహనోత్సవంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
MDK: రామాయంపేట మండలం రాయిలాపూర్ గ్రామంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ ఆలయంలో అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సీతారాముల కల్యాణాన్ని కనులారా వీక్షించి పులకించిపోయారు. అనంతరం భక్తులకు ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు.
CTR: కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటన SR పురం మండలం పరిధిలోని చిత్తూరు- పుత్తూరు జాతీయ రహదారిపై చిన్నతయ్యారు గ్రామం వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తలించారు. ఈ ఘటపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
HYD: శ్రీరామనవమి శోభాయాత్రను పురస్కరించుకొని సీపీ సజ్జనార్ సీతారాం బాగ్ పరిసరాల్లో చేపట్టిన భద్రత ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీరాముడి శోభాయాత్ర ప్రశాంతంగా సాగేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, రాత్రి 10 గంటల వరకు శోభాయాత్ర ముగిసేలా పక్కా రూట్ మ్యాప్ సిద్ధం చేశామన్నారు.
చమురు కొరత వేళ రిఫైనరీలు విదేశాలకు ఇంధనాన్ని తరలించకుండా ఉండేందుకు ఎగుమతులపై పన్ను విధించినట్లు కేంద్రమంత్రి నిర్మలమ్మ తెలిపారు. తద్వారా చమురు కంపెనీలు లాభాల కోసం చూడకుండా దేశీయ మార్కెట్కే ప్రాధాన్యత ఇచ్చేలా నిబంధనలను కఠినతరం చేసినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉన్నా సామాన్యుడిపై భారం పడకుండా ఉండేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
భూపాలపల్లి మండలం గొర్లవేడు గ్రామంలోని రామాలయంలో శ్రీ సీతారాముల తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయాన్నే ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు.
NDL: నంది కొట్కూరులో ఇవాళ జీవో 98 బాధితులు 2వ రోజు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. CPM పార్టీ నాయకులు నాగేశ్వరావు తమ బృందంతో కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవో 98 ప్రకారం ఇళ్లు నిర్మించి, ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CPM పార్టీ నాయకులు 98 GO బాధితులు పాల్గొన్నారు.
GNTR: శ్రీరామ నవమి సందర్భంగా గుంటూరు నగరంలో నిర్వహించిన శోభాయాత్రను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి శుక్రవారం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. బృందావన్ గార్డెన్స్లోని వెంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ యాత్రను ఘనంగా చేపట్టారు. తొమ్మిది సంవత్సరాలుగా నిరంతరంగా శోభాయాత్ర నిర్వహించడం శుభపరిణామమని పేర్కొన్నారు.