NZB: సామ్రాజ్యవాద వ్యతిరేకతే నిజమైన దేశభక్తి అని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా నాయకులు అన్నారు. బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్దేవ్ల త్యాగాలను స్మరించుకుంటూ వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారన్నారు. నేటి యువతకు ఎంతో వారు ఎంతో స్ఫూర్తినిస్తారని నేతలు కొనియాడారు.
JGL: జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థులు రోడ్డెక్కారు. రాష్ట్రంలో మద్యం శాఖకు మంత్రి ఉన్నప్పటికీ, విద్యా శాఖకు మంత్రి లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని విమర్శించారు. తక్షణమే బకాయిలను విడుదల చేయాలని విద్యార్ధి నాయకులు డిమాండ్ చేశారు.
SRCL: రుద్రంగి మండలం, కథలాపూర్ మండలం కలిగోట సరిహద్దుల్లో పులి సంచరింస్తున్నట్లు వదంతులు రావడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా పాదముద్రలను పరిశీలించి అవి హైనా పాద గుర్తులని, ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్వో పద్మారావు, సెక్షన్ ఆఫీసర్ ముస్తాక్ అలీ, బీట్ ఆఫీసర్ శ్రావణ్, సర్పంచ్ రమేశ్ ఉన్నారు.
MHBD: యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని తొర్రూరు ఎస్సై ఉపేందర్ సూచించారు. ఇవాళ తొర్రూరు మండలం చర్లపాలెం గ్రామంలో గంజాయి నిర్మూలన, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని కోరారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.
TG: రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీసీ సీఎం అవుతారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అది కాంగ్రెస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. బీసీని సీఎం చేస్తామని చెప్పే దమ్ము బీజేపీకి ఉందా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ బీసీని సీఎం చేస్తామని చెప్పగలరా? అని నిలదీశారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీ అని 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటోందన్నారు.
AP: అనకాపల్లి జిల్లాలో భారీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. రూ.1.36 లక్షల కోట్లతో మిట్టల్ స్టీల్ప్లాంట్ ప్రారంభంకానుంది. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు పనుల కోసం రెండు దశల్లో 5,465 ఎకరాల్లో భూమి సేకరించనున్నారు. తొలిదశలో 2164 ఎకరాల భూమి కేటాయింపు జరగనుంది.
ELR: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఇవాళ జిల్లా SP ప్రతాప్ శివ కిషోర్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యల కోసం జిల్లా కార్యాలయం వరకు వచ్చి సమయం, డబ్బు వృథా చేసుకోకుండా స్థానిక ప్రభుత్వ కార్యాలయాలను ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు.
RR: చేవెళ్ల నియోజకవర్గం నవాబుపేట్ మండలం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన కే.గిరిని ఏఎంసీ ఛైర్మన్ గీత సింగ్, డైరెక్టర్స్ కందాడ నరసింహారెడ్డి, చిట్టెపు రాజశేఖర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని,అందుకు అందరూ సహకరించాలని కోరారు.
KRNL: పుటకలమర్రి AP మోడల్ స్కూల్, jr. కాలేజీలో 2026-27 విద్యాసంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ షమీలా తెలిపారు. MPC, BiPC, MEC, CEC గ్రూపులు అందుబాటులో ఉన్నాయన్నారు. OC/0BCలకు రూ.200, SC/STలకు రూ.150 దరఖాస్తు రుసుముగా నిర్ణయించామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు APR 30వ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
VSP: జీవీఎంసీ పరిధిలోని ఆస్తిపన్ను చెల్లింపుదారులకు కమిషనర్ కేతన్ గార్గ్ తీపి కబురు చెప్పారు. మార్చి 31లోగా బకాయిలు చెల్లిస్తే వడ్డీపై 50% రాయితీ వస్తుందని ప్రకటించారు. ఇంటి పన్ను, ఖాళీ జాగా పన్ను బకాయిలపై ఈ మినహాయింపు వర్తిస్తుందన్నారు. సెలవు రోజుల్లో కూడా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కౌంటర్లు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.
CTR: ప్రముఖ సంఘసంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ ఘన నివాళులు అర్పించారు. వెనుక పడిన వర్గాల అభ్యున్నతికి, విద్యా ప్రాచుర్యానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని చెప్పారు. విదేశీ విద్యకు వ్యతిరేకంగా తన ఆస్తులను సైతం దానం ఇచ్చారని కొనియాడారు.
జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు నిరసన చేపట్టారు. TRP జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సతీష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. రాష్ట్ర జనాభాలో 60 శాతానికి పైగా ఉన్న బీసీలకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు కూడా చేయకపోవడం దురదృష్టకరమని, బడ్జెట్లో బీసీలకు మొండిచేయి చూపించారని విమర్శించారు.
PDPL: ధర్మారం మండలంలో ఇవాళ నిర్వహించిన పదవ తరగతి ఆంగ్లం పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు ఎంఈవో ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. 710 మంది విద్యార్థులకు మొత్తం మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఎక్కడ మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు. 100% హాజరు నమోదు అయిందన్నారు.
BHNG: ప్రజావణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి వచ్చిన 52 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
AP: సీఎం చంద్రబాబు అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి కుమారస్వామితో పాటు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, Dy.CM పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ భారీ పరిశ్రమ ఏర్పాటుతో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.