• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »బిజినెస్

తప్పనిసరిగా ఏఐ వాడాల్సిందే: యాక్సెంచర్

AIతో కంపెనీల్లో పని సంస్కృతి మారుతోంది. తాజాగా యాక్సెంచర్‌ కూడా తమ సీనియర్ ఉద్యోగులు ఏఐ టూల్స్‌ను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని సూచించింది. వాటి వినియోగం ఆధారంగానే లీడర్‌షిప్ రోల్స్‌ అందుకుంటారని, లేకపోతే ప్రమోషన్లు ఉండవని సంకేతాలు ఇచ్చింది. కాగా, ఇటీవల యాక్సెంచర్ 11వేల మందికి లేఆఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

February 20, 2026 / 03:25 PM IST

BREAKING: తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 320 తగ్గి రూ.1,56,170కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.300 పెరిగి రూ.1,43,150 పలుకుతోంది. అటు వెండి ధరలో నిన్నటితో పోల్చితే ఎలాంటి మార్పు లేదు. కిలో వెండిధర రూ.2,70,000ల వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.

February 20, 2026 / 09:50 AM IST

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 258.21 పాయింట్లు నష్టపోయి 82239.93 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 68.80 పాయింట్ల నష్టంతో 25385.55 దగ్గర కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.98గా ఉంది.

February 20, 2026 / 09:34 AM IST

NITCలో ఉద్యోగాలు.. ఇవాళే లాస్ట్

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాలికట్(NITC)లో 15 అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-2 పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఇవాళే లాస్ట్ డేట్. ఆర్ట్స్ ఆఫ్ సోషల్ సైన్సెస్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఖాళీలు ఉండగా.. PhD ఉత్తీర్ణత గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 45-50 ఏళ్ల మధ్య ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. 

February 20, 2026 / 07:02 AM IST

ALERT: దరఖాస్తులు ప్రారంభం 

TG: ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజే ఇంజినీరింగ్ విభాగానికి 1,950 మంది, అగ్రికల్చర్‌కు 1,430, రెండింటికి కలిపి ఐదుగురు.. మొత్తంగా 3,385 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదట వచ్చిన దరఖాస్తుల ఆధారంగా పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామని ఎప్‌సెట్ కన్వీనర్ ఆచార్య విజయకుమార్ రెడ్డి వెల్లడించారు. విద్యార్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

February 20, 2026 / 06:15 AM IST

ఏప్రిల్‌ 20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు 

TG: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (టాస్) పరిధిలోని పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు నిర్వహిస్తామని టాస్ సంచాలకుడు పీవీ శ్రీహరి తెలిపారు. ఉదయం, సాయంత్రం పరీక్షలు ఉంటాయని అన్నారు. ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు నిర్వహిస్తామని చెప్పారు.

February 20, 2026 / 05:03 AM IST

HIT TV SPECIAL: జనరల్ నాలెడ్జ్

1. బాగ్‌లిహార్‌ ఆనకట్ట ఏ నదిపై ఉంది?ANS: చీనాబ్‌2. జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?ANS: జనవరి 253. భారత ‘ఎయిర్‌ఫోర్స్‌ డే’ ఎప్పుడు నిర్వహిస్తారు?ANS: అక్టోబరు 84. ఈశాన్య భారత సరిహద్దుల్లో తొలి వాణిజ్య బొగ్గు గని ఏది?ANS: నమ్‌చిక్-నమ్‌ఫుక్

February 20, 2026 / 04:15 AM IST

చాట్‌జీపీటీతో జతకలిసిన జియో హాట్‌స్టార్

చాట్‌జీపీటీ, జియోహాట్‌స్టార్ జతకలిశాయి. ఇకపై చాట్ జీపీటీలో వినోదాత్మక కంటెంట్ గురించి సెర్చ్ చేసే వారికి జియో హాట్‌స్టార్ స్ట్రీమింగ్ లింక్‌లు కనిపించనున్నాయి. మరోవైపు జియోహాట్ స్టార్, ఓపెన్ ఏఐ కలిసి చాట్‌జీపీటీ పవర్డ్ వాయిస్ డిస్కవరీ ఫీచర్‌ను కూడా తీసుకువచ్చాయి. ఇది వ్యూయర్స్ అడిగిన దాన్ని బట్టి వినోదాత్మక కంటెంట్‌ను సజెస్ట్ చేయనుంది.

February 19, 2026 / 11:16 PM IST

15 రోజుల్లో డెత్‌క్లెయిమ్‌ సెటిల్‌మెంట్..

ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ సులభతర విధానాన్ని పరిచయం చేసింది. డెత్‌ క్లెయిమ్‌ సెటిల్‌మెంట్‌ కోసం ఆన్‌లైన్‌ సదుపాయాన్ని తీసుకొచ్చింది. బ్యాంకు ఖాతాదారులు మరణించిన సందర్భాల్లో కుటుంబసభ్యులు, వారి వారసులు బ్యాంకును సందర్శించకుండానే ఈ డెత్‌క్లెయిమ్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

February 18, 2026 / 07:46 PM IST