మరో దిగ్గజ సంస్థ సీఈఓగా భారత్ సంతతి వ్యక్తి ఎన్నికయ్యారు. మైక్రోసాఫ్ట్ గేమింగ్ సీఈఓగా ఆశా శర్మను నియమిస్తూ సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న ఫిల్ స్పెన్సర్ పదవీ విరమణ చేయడంతో ఆశాకు ఆ పదవి దక్కింది. ఆయన స్థానంలో గేమిండ్ డివిజన్కు సీఈఓ, వైస్ ప్రెసిండెంట్గా ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు.
నిరుద్యోగ యువతకు భారతీయ రైల్వే తరఫున RRB శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పోస్టులకు 10, ITI/డిప్లొమా ఉత్తీర్ణులైనవారు అర్హులు కాగా.. వీటిల్లో 674 సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఉండటం విశేషం. CBT 1 & 2, CBAT, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
హైదరాబాద్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,910 పెరిగి రూ.1,59,280కు చేరింది. అలాగే, ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,750 పెరిగి రూ.1,46,000గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.20,000 పెరిగి రూ.2,90,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
TG: రాష్ట్రంలోని గురుకులాల్లో 5వ తరగతి ప్రవేశాలు, 6-9 తరగతుల బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం TGCET నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా రేపు 492 కేంద్రాల్లో ఉ.11-మ.1 గంటల మధ్య పరీక్ష జరగనుంది. నిమిషం నిబంధన ఉండే అవకాశమున్న నేపథ్యంలో విద్యార్థులు ముందగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం ఉత్తమం. మాక్ టెస్ట్ పేపర్స్, హాల్ టికెట్లు తదితర వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్(MANAGE)లో 3 అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి గడువు ఇవాళ్టితో ముగియనుంది. పీజీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం గల 35 ఏళ్లలోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉండనుండగా.. జీతంగా నెలకు రూ.57,700-1,82,400 చెల్లిస్తారు.
దేశవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థుల నుంచి యువ విజ్ఞాన కార్యక్రమానికి (యువిక) ఇస్రో దరఖాస్తులు స్వీకరిస్తోంది. వైజ్ఞానిక శాస్త్రంతో పాటు అంతరిక్ష పరిజ్ఞానంపై క్విజ్ రూపంలో పిల్లలను అధికారులు పరీక్షిస్తారు. దీనికి ఈనెల 27 నుంచి మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. 2026 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న భారతీయ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
AP: ఏపీ పీజీ లాసెట్-26కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు లాసెట్ కన్వీనర్ ఆచార్యులు సీతాకుమారి వెల్లడించారు. 3, 5 సంవత్సరాల LLB, రెండేళ్ల LLM కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు మార్చి 12 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 4న ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు https://cets.apsche.ap.gov.in/ వెబ్సైట్ను పరిశీలించాలని సూచించారు.
TG: రాష్ట్రంలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి, రెండేళ్ల బీఈడీ కోర్సులో చేరేందుకు నిర్వహించే అర్హత పరీక్ష ‘టీజీ ఎడ్-సెట్-2026’ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారితంగా పరీక్ష నిర్వహిస్తారు.
NLG: నారాయణపేటలో జరగనున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలకు చెరుకుపల్లి జెడ్పీహెచ్ఎస్ విద్యార్థినులు ఇస్లావత్ మౌనిక, జరుపుల రేణుక ఎంపికయ్యారని ఎంఈఓ గోప్యా నాయక్ తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో రాణించడం గర్వకారణమని ఆయన అభినందించారు. విద్యార్థినులు జిల్లాకు పేరు తేవాలని ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆకాంక్షించారు.
‘గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని ఎవరికి పేరు?A) గోపాలకృష్ణ గోఖలేB) దాదాభాయ్ నౌరోజీC) సర్దార్ వల్లభాయ్ పటేల్D) మదన మోహన మాలవీయ నిన్నటి ప్రశ్న: హైదరాబాద్ రాష్ట్ర తొలి ఎన్నికైన ముఖ్యమంత్రి ఎవరు?జవాబు: బూర్గుల రామకృష్ణారావు
డెస్క్టాప్ యాప్ తర్వాత, ఏప్రిల్-2026లో Messenger.com వెబ్సైట్ను కూడా నిలిపివేస్తున్నట్లు మెటా ప్రకటించింది. ఇకపై బ్రౌజర్లో మెసెంజర్ను నేరుగా ఫేస్బుక్ ద్వారానే యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. చాట్ సేవలను తిరిగి ప్రధాన ఫేస్బుక్లోకి అనుసంధానించే క్రమంలో మెటా ఈ మార్పులు చేస్తోంది. అయితే, మొబైల్ యాప్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి.
AP: విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. మార్చి 16 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఉ.8 నుంచి మ.12:30 గంటల వరకు తరగతులు జరుగుతాయని వెల్లడించింది. 10వ తరగతి పరీక్షలు జరిగే స్కూళ్లలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సా.5 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. మరోవైపు తెలంగాణలోనూ మార్చి 16 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.
వాట్సాప్ గ్రూపుల్లో కొత్తగా చేరే వారికి పాత సంభాషణలు తెలిసేలా ‘హిస్టరీ షేరింగ్’ ఫీచర్ను మెటా పరిచయం చేసింది. అడ్మిన్లు గత 25 నుండి 100 మెసేజ్లను కొత్త సభ్యులతో షేర్ చేయవచ్చు. ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్తో ఇది పూర్తి సురక్షితం. హిస్టరీ షేర్ చేసినప్పుడు గ్రూప్ సభ్యులందరికీ సమాచారం అందుతుంది. అవసరమైతే అడ్మిన్లు ఈ ఫీచర్ను ఎప్పుడైనా నిలిపివేయవచ్చు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 316.57 పాయింట్లు లాభపడి 82814.71 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 116.90 పాయింట్ల లాభంతో 25571.25 దగ్గర ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 91గా ఉంది.