• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘బొగ్గు లారీల రవాణాను నిలిపివేయాలి’

AKP: పరవాడ, లంకెలపాలెం మీదుగా బొగ్గు లారీల రవాణాను నిలిపివేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి డిమాండ్ చేశారు. శుక్రవారం పరవాడ జంక్షన్‌లో ఈ మేరకు రాస్తారోకో నిర్వహించారు. బొగ్గు లోడుతో రాకపోకలు సాగించే లారీలు నుంచి బొగ్గు రోడ్లపై పడుతుండడంతో ప్రజలు పలు అవస్థలు పడుతున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల అనారోగ్యానికి గురవుతున్నారన్నారు.

February 27, 2026 / 03:32 PM IST

లంకతోటలో ఘనంగా నూతన రామాలయ ప్రతిష్ట

కృష్ణా: చల్లపల్లి మండలం పాగోలు శివారు లంకతోట గ్రామంలో శుక్రవారం శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్ల నూతన ఆలయ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. వేద పండితులు యాగాది క్రతువులు నిర్వహించి, నూతన దేవత విగ్రహాలు ప్రతిష్టించారు. నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, వైస్ ఎంపీపీ మోర్ల రాంబాబు, యార్లగడ్డ శ్రీనివాసరావు, ఎంపీటీసీ బంగారు బాబు, శివ పాల్గొన్నారు.

February 27, 2026 / 03:31 PM IST

దేవాదాయ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే బేబీనాయన

VZM: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని ఇవాళ బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా నియోజకవర్గంలో గల ఆలయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. అలానే, వారికి బొబ్బిలి శ్రీ వేణుగోపాలస్వామి వారి చిత్రపటాన్ని బహూకరించి, తప్పకుండా బొబ్బిలి రావాలని ఆహ్వానించారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఆలయాల అభివృద్ధికి సహకరిస్తామన్నారు.

February 27, 2026 / 03:30 PM IST

‘కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్రపటాన్ని ముద్రించాలి’

కోనసీమ: మార్చి 22వ తేదీన మామిడికుదురులో కరెన్సీ నోట్లపై అంబేద్కర్ చిత్ర పటాన్ని ముద్రించాలన్న డిమాండ్‌తో ధూమ్ తడక్ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని జిల్లా పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్బంగా ఈదరాడ గ్రామంలో శుక్రవారం బహిరంగ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. రెవెన్యూ కార్యాలయం దగ్గరలో సభ కార్యక్రమం జరుగుతుందన్నారు.

February 27, 2026 / 03:30 PM IST

గుంటూరు జూనియర్ సివిల్ కోర్టుల ఏజీపీగా నాగేంద్రబాబు

గుంటూరు జూనియర్ సివిల్ కోర్టులలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP)గా సీనియర్ న్యాయవాది మేత్రా నాగేంద్రబాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. నాగేంద్రబాబు నియామకం పట్ల తోటి న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

February 27, 2026 / 03:29 PM IST

మదనపల్లె నూతన టూటౌన్ ఎస్సై బాధ్యతల స్వీకరణ

అన్నమయ్య: మదనపల్లె రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్సైగా నాగేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు జరిగిన సాధారణ బదిలీల్లో భాగంగా, చౌడేపల్లిలో పనిచేస్తున్న నాగేశ్వరరావు ఇక్కడకు బదిలీపై వచ్చారు. ఆయన గతంలోనూ ఇక్కడ ఎస్సైగా పనిచేయడం విశేషం. ఇప్పటివరకు ఇక్కడ విధులు నిర్వహించిన రహీముల్లా వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.

February 27, 2026 / 03:29 PM IST

అర్థవీడు ఈసీ బెల్లంకొండ కిషోర్ సస్పెండ్

ప్రకాశం: అర్ధవీడు మండలంలో ఈసీ బెల్లంకొండ కిషోర్ విధులు నిర్వహిస్తున్న సమయంలో లేని మొక్కలను ఉన్నట్లుగా చూపించి అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం ఈసీ బెల్లంకొండ కిషోర్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా పీడీ జోసెఫ్ కుమార్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మార్కాపురంలో విధులు నిర్వహిస్తున్న ఆయనపై విచారణ కొనసాగుతోంది.

February 27, 2026 / 03:26 PM IST

జాతర బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన పోలీసులు

ELR: కైకలూరు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొల్లేటి కోటలో వెలసిన శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలకు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలను ఏర్పాటు చేశారు. శుక్రవారం కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు భద్రత చర్యలను పర్యవేక్షించారు. ఉత్సవ నిర్వహణ కొరకు 150 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.

February 27, 2026 / 03:23 PM IST

రాజకీయం శాశ్వతం కాదు.. అభివృద్ధి నా లక్ష్యం: మాజీ MLA

ప్రకాశం: మాజీ MLA అన్నా రాంబాబు మార్కాపురం YCP కార్యాలయంలో మాట్లాడారు. జులై 2026 నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని CM ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. మీరు చెప్పిన విధంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయండి. ఈ ప్రాంత ప్రజానీకమంతా రాజకీయంగా మీ వెంట ఉంటామని పేర్కొన్నారు. రాజకీయం శాశ్వతం కాదు.. మా ప్రాంతం అభివృద్ధి చెందడం నా లక్ష్యమని ఆయన తెలిపారు.

February 27, 2026 / 03:20 PM IST

ప్రైవేటు పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు

అన్నమయ్య: 1 వ తరగతి ప్రైవేటు పాఠశాలలో ఉచిత ప్రవేశం కోసం ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారని రాజంపేట MEOలు రఘునాథరాజు, డి. సుబ్బరాయుడు తెలిపారు. అందుకు సంబంధించి ప్రచార కరపత్రాలను శుక్రవారం వారు విడుదల చేశారు. అన్ని ప్రైవేటు పాఠశాలలో 2026-27 సంవత్సరానికి గాను అర్హులైన ప్రతి ఒక్కరు తమ పరిధి లోని గ్రామ సచివాలయంలో, మీ సేవలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

February 27, 2026 / 03:11 PM IST

ప.గో జిల్లా కలెక్టర్ ఆగ్రహం

WG: ఏకీకృత కుటుంబ సర్వేను శనివారం సాయంత్రానికి వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో నిర్వహించిన గూగుల్ మీట్ సమీక్షలో ఆమె మాట్లాడారు. నిరంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నప్పటికీ, సర్వేలో ఆశించిన ప్రగతి కనిపించకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

February 27, 2026 / 03:10 PM IST

పేదల ఆరోగ్యానికి భరోసా CMRF: MLA

KDP: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోందని MLA నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరులో నియోజకవర్గంలోని 53 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ. 54.81 లక్షల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఆపదలో ఉన్న పేదవారిని ఆదుకోవాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.

February 27, 2026 / 03:10 PM IST

ఆలూరు నియోజకవర్గ అభివృద్ధివే లక్ష్యం

KRNL: ఆలూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా టీడీపీ ఇంచార్జి వైకుంఠం జ్యోతి రూపకల్పనలో అంగస్కల్ గ్రామంలో పోస్టర్ల ప్రచార కార్యక్రమం ఇవాళ ఉత్సాహంగా నిర్వహించారు. ఆలూరు కన్వీనర్ కటారికొండ శ్రీనివాసులు నాయకత్వంలో జరిగిన కార్యక్రమంలో కొమ్ము రాజు,సోమశేఖర్ పాల్గొన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి ఆలూరు భవిష్యత్తును మార్చడమే లక్ష్యమని తెలిపారు.

February 27, 2026 / 03:10 PM IST

ఇంటర్ పరీక్షలకు ఎంత మంది గైహాజరు అంటే..!

ఏలూరు: జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బోటనీ , హిస్టరీ వన్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. 3,197 మంది విద్యార్థులకు 2,707 మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. 490 మంది పరీక్షకు గైహాజరయ్యారని దీని కారణంగా 85% హాజరు నమోదు అయిందని అధికారులు వివరించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు చర్యలు ఏర్పాటు చేశామన్నారు.

February 27, 2026 / 03:08 PM IST

CRDAలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

NTR: AP CRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన MIS ఆపరేటర్, ESM యూనిట్ డైరెక్టర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, DEE-ఎలక్ట్రికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 2లోపు https://crda.ap.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని CRDA కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. విద్యార్హత, దరఖాస్తు విధానం తదితర వివరాల కోసం వెబ్ సైట్ ను సందర్శించగలరు.

February 27, 2026 / 03:08 PM IST