KDP: ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తోందని MLA నంద్యాల వరదరాజుల రెడ్డి తెలిపారు. శుక్రవారం ప్రొద్దుటూరులో నియోజకవర్గంలోని 53 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన రూ. 54.81 లక్షల చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కుల మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఆపదలో ఉన్న పేదవారిని ఆదుకోవాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.