గుంటూరు జూనియర్ సివిల్ కోర్టులలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ (AGP)గా సీనియర్ న్యాయవాది మేత్రా నాగేంద్రబాబు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభా దేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. నాగేంద్రబాబు నియామకం పట్ల తోటి న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.