NLR: నర్రవాడ శ్రీవెంగమాంబ పేరంటాలు దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలకు వరికుంటపాడు నరసింహపురం గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త ట్రాక్టర్ ద్వారా పశుగ్రాసాన్ని ఆలయ నిర్వహకులకు బుధవారం అందజేశారు. గోశాలకు దాతలు ముందుకు వచ్చి గోవులను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. ధర్మంలో భాగంగా ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు.
ELR: ముసునూరు(మం) సూరేపల్లిలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న కోడిపందాల శిబిరంపై పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఎస్సై చిరంజీవి మాట్లాడుతూ.. ఈ దాడులలో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుంచి ఒక కోడిపుంజు, రూ. 8700 నగదు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
అన్నమయ్య: రైతులు అధిక ఆదాయం ఇచ్చే ఉద్యానవన పంటల వైపు మళ్లాలని, వ్యవసాయంలో డ్రోన్ల వినియోగాన్ని పెంచాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మామిడి తోటల్లో డ్రిప్ ఇరిగేషన్ వినియోగంపై సూచనలు చేసి, భూగర్భ జలాల పెంపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
KRNL: తుగ్గలి(మం) రేల్లపాడు తాండలో రీ న్యూ ప్రైవేట్ విండ్ పవర్ కంపెనీ రైతులు నాగేంద్ర నాయక్, సురేష్ నాయక్ల పొలాల్లో హెన్డీ లైన్లు వేయడానికి ప్రయత్నించడంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. బుధవారం కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. కంపెనీకి వత్తాసు పలుకుతున్న తుగ్గలి తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలన్నారు.
ASR: సిబ్బంది నియామకాలతో జీసీసీని బలోపేతం చేయాలని జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన అమరావతి సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్ను కలిసి జీసీసీలోని సిబ్బంది కొరత, పరిపాలన, నిర్మాణాత్మక సమస్యలపై చర్చించారు. జీసీసీ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, జీసీసీ గోదాములు, డిపోలను మరమ్మత్తులు చేయాలని తెలిపారు.
AKP: రెవెన్యూ క్లినిక్లో వచ్చిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ డీఆర్వో, ఆర్డీఓలు, తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రెవెన్యూ సేవలలో సమయపాలన, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనను కట్టుదిట్టం చేయాలన్నారు.
ASR: యువతలో నాయకత్వ లక్షణాలు పెంచడానికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా కృషి చేస్తుందని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా కేబీకే నాయక్ అన్నారు. బుధవారం కళాశాలలో నిర్వహించిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2026ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో 83 మంది యువత పాల్గొని 50 ఇయర్స్ ఎమర్జేన్సీ, లెసన్స్ ఫర్ ఇండియన్ డెమోక్రసీ అంశంపై మాట్లాడారు.
KDP: బద్వేల్ పరిధిలోని పూల బావివీధిలో జరుగుచున్న డ్రైనేజ్ పనులను మున్సిపల్ కమిషనర్ వీ.వీ. నరసింహ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. డ్రైనేజ్లలో నీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, పారిశుధ్య పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రకాశం: బేస్తవారిపేటలో బుధవారం రాత్రి ఎస్ఐ రవీంద్రారెడ్డి నైట్ బీట్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,రాత్రి సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను నిలదీసి, సాంకేతిక పరిజ్ఞానంతో వారి వివరాలు, వేలిముద్రలు పరిశీలిస్తూ నేరాలకు తావులేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
తూ.గో: గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో సాయిబాబా గుడి హుండిని కొల్లగొట్టి సొమ్ము అపహరించినట్లు గుడి కమిటీ మెంబర్ సూర్య ప్రకాష్ 3వ తేదీన గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అదే గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ను అదుపులోని తీసుకుని రూ. 9వేల రికవరీ చేశామన్నారు.
ASR: క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అనంతగిరి ఎంపీపీ తెడబారికి మితుల పేర్కొన్నారు. గిరిజన యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకొని, క్రీడల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. బుధవారం అనంతగిరి మండలంలోని చిలకలగెడ్డ పంచాయతీ దిగువబూడి గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా క్రికెట్ టోర్నమెంట్ను సర్పంచ్ అప్పారావుతో కలిసి ఎంపీపీ ప్రారంభించారు.
TPT: ఇంటి నుంచి పారిపోయి తిరుపతికి చేరుకున్న తెలంగాణ రాష్ట్రం ఘట్కేసర్కు చెందిన బాలుడు లావేటి సుజిత్ కుమార్ను అలిపిరి చెక్ పాయింట్ వద్ద టీటీడీ భద్రతా సిబ్బంది గుర్తించారు. అతని వివరాలను సేకరించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈ మేరకు బుధవారం సురక్షితంగా బాలుడిని అప్పగించారు. కుమారుడు దొరకడంతో కుటుంబ సభ్యులు టీటీడీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
PPM: గర్భిణీల్లో ప్రమాదకర లక్షణాలను ముందస్తుగా గుర్తించి సకాలంలో చికిత్స, పర్యవేక్షణ ఉండాలని DMHO డా. ఎస్. భాస్కరరావు స్పష్టం చేశారు. హైరిస్క్ గర్భిణీల ఆరోగ్య నిర్వహణ, నియమాలపై వైద్యాధికారులకు ఓరియెంటేషన్ శిక్షణను ఎన్జీఓ హోంలో బుధవారం నిర్వహించారు. ప్రభుత్వ అనుబంధ అర్మాన్ స్వచ్ఛంద సంస్థ నుండి డా. కె. విద్యాసాగర్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
AKP: సీతపాలెంలో ఏర్పాటు చేయనున్న బ్లూ జెట్ ఫార్మా కంపెనీను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు బుధవారం ఆందోళన చేశారు. ఫార్మా పరిశ్రమల వల్ల వాయు,జల కాలుష్యం పెరిగి 20 వేల మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే సెజ్లోని కంపెనీల వ్యర్థాలతో మత్స్య సంపద దెబ్బతిందని వాపోయారు. తక్షణమే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి శంకుస్థాపన నిలుపుదల చేయాలన్నారు.
ATP: గుంతకల్లు వాసి నాగర్జున NCTE అమలు చేస్తున్న జాతీయ మెంటరింగ్ మిషన్ NMMలో మెంటర్గా అధికారికంగా బుధవారం ఎంపికయ్యారు. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ప్రారంభించిన ఈ మిషన్ లక్ష్యం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకు అకాడెమిక్, వృత్తిపరమైన మార్గదర్శకత్వం అందించడం కోసం రూపొందించబడింది. ఈ సందర్బంగా నాగార్జునకు పలువురు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.