AKP: సీతపాలెంలో ఏర్పాటు చేయనున్న బ్లూ జెట్ ఫార్మా కంపెనీను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు బుధవారం ఆందోళన చేశారు. ఫార్మా పరిశ్రమల వల్ల వాయు,జల కాలుష్యం పెరిగి 20 వేల మంది ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే సెజ్లోని కంపెనీల వ్యర్థాలతో మత్స్య సంపద దెబ్బతిందని వాపోయారు. తక్షణమే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి శంకుస్థాపన నిలుపుదల చేయాలన్నారు.