NLR: నర్రవాడ శ్రీవెంగమాంబ పేరంటాలు దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలకు వరికుంటపాడు నరసింహపురం గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త ట్రాక్టర్ ద్వారా పశుగ్రాసాన్ని ఆలయ నిర్వహకులకు బుధవారం అందజేశారు. గోశాలకు దాతలు ముందుకు వచ్చి గోవులను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. ధర్మంలో భాగంగా ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహ కలిగి ఉండాలన్నారు.