KDP: బద్వేల్ పరిధిలోని పూల బావివీధిలో జరుగుచున్న డ్రైనేజ్ పనులను మున్సిపల్ కమిషనర్ వీ.వీ. నరసింహ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. డ్రైనేజ్లలో నీరు నిల్వ ఉండకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, పారిశుధ్య పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.