Gold and Silver Rates Today : బంగారం స్వల్పంగా, వెండి భారీగా పెరిగింది. గత వారం అంతా దాదాపుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈ వారం మొదటి నుంచి అప్ట్రెండ్లో ఉన్నాయి. బుధవారం మార్కెట్ ప్రారంభ సమయానికి పది గ్రాముల బంగారం రూ.230 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల పసిడి ధర నేడు రూ.74,810కి చేరుకుంది.
పసిడి ధర(Gold Rate) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోనూ ఇలాగే ఉన్నాయి. విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడల్లోనూ 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.74,810గానే ఉంది. అయితే ఈ ధర మార్కెట్ మొదలయ్యే సమయంలో ఉన్నది మాత్రమే. తర్వాత మళ్లీ మారే అవకాశాలు ఉంటాయి. నగల్ని కొనుక్కునే వారు ఈ ధరకు తోడుగా రాళ్లు, మజూరీ, జీఎస్టీ లాంటి వాటిని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఇక వెండి ధరలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గత వారం రోజులుగా వీటి తీరు ఇలాగే ఉంది. దేశీయ మార్కెట్లలో కిలో వెండి ధర(Silver Rate) బుధవారం సైతం పెరిగింది. రూ.695 పెరగడంతో కేజీ వెండి నేడు రూ.94,170కు చేరుకుంది. విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ తదితర చోట్ల సైతం దీని ధరలు ఇలాగే ఉన్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2368 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి 30.8 డాలర్లుగా ఉంది.