నేషనల్ మెరిట్ స్కాలర్షిప్పై తెలంగాణ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2025-26 విద్యా సంవత్సరానికి గానూ తాజా, రెన్యూవల్ దరఖాస్తులకు చివరి తేదీని నవంబర్ 30 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించింది. దరఖాస్తులను scholarships.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సమర్పించాలి. ఎంపికైన అభ్యర్థుల వివరాలకు tgbie.cgg.gov.inను చూడండి.