TG: తొర్రూర్, బహూదూర్పల్లి, కుర్మల్గూడ ప్రాంతాల్లోని లేఔట్లలో ఇళ్ల నిర్మాణానికి అనువైన 163 ఖాళీ ప్లాట్లను వేలం ద్వారా విక్రయించనున్నట్లు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ MD ప్రకటించారు. ఈనెల 17, 18న పెద్ద అంబర్పేటలోని అవికా కన్వెన్షన్లో ప్లాట్ల వేలం జరుగుతుందని, ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు ఈనెల 15లోగా దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు.