ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసే వారికి త్వరలో ఛార్జీల భారం పెరగనుంది. పండుగల సీజన్కు ముందుగానే జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు తమ ప్లాట్ఫామ్ ఫీజులను పెంచాయి. దీనికి అదనంగా ఈ నెల 22 నుంచి డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ కూడా విధించనున్నారు. దీంతో వినియోగదారులకు జొమాటో ఆర్డర్లపై రూ.2, స్విగ్గీ ఆర్డర్లపై రూ.2.6 అదనపు భారం పడనుంది.