TG: యాదాద్రి జిల్లా పాలడుగులో దారుణం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో అన్న భార్య వెంకటమ్మ గొంతును మరిది బొంత అశోక్ కత్తితో కోశాడు. అశోక్ అన్న నర్సింహ ఇటీవలే మరణించగా.. ఇరు కుటుంబాల మధ్య భూ తగాదాపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం వెంకటమ్మతో అశోక్, అతని ఇద్దరు మనవళ్లు గొడవపడ్డి గొంతు కోశారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుండగా.. పోలీసులు కేసు నమోదు చేశారు.