PDPL: రామగుండంలో ప్రజాపాలన పేరుతో పోలీసులు చట్టాన్ని అతిక్రమిస్తూ, ప్రశ్నించే వారిపై లాఠీలతో దాడులు చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల్ల హరీశ్ రెడ్డి మండిపడ్డారు. గోదావరిఖనిలో న్యాయవాదుల నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. న్యాయవాది తిలక్పై అనుచితంగా ప్రవర్తించిన వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు.