ELR: రైలు ఢీకొనడంతో యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఏలూరు కొత్తపేటకు చెందిన పులప మహేష్ (32) స్థానికంగా ఒక జ్యూయలరీ దుకాణంలో సేల్స్మెన్గా పనిచేస్తుంటాడు. మంగళవారం తన ఇంటి సమీపంలో పట్టాలను దాటుతుండగా రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చరీకి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.