E.G: ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావు పేటలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ప.గో జిల్లా అత్తిలికి చెందిన కే.వెంకట సుబ్బారావు మృతి చెందాడు. ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. చెట్టుకొమ్మ విరిగి ప్రమాదవశాత్తు అతనిపై పడింది. తీవ్రగాయాలైన అతడిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.