సత్యసాయి: నల్లచెరువు మండలం బందార్లపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువలో ప్రమాదవశాత్తు తండ్రికొడుకులు గల్లంతయ్యారు. తండ్రి రాము(40) మృతదేహం లభించగా, ఎనిమిదేళ్ల కుమారుడు చిన్నోడు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.