SDPT: హుస్నాబాద్ కస్తూరిబా కాలనీ సమీపంలో బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన నెలకొంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిగురుమామిడి మండలం కొండాపూర్కి చెందిన జంగాపల్లి సాంబరాజు(35) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.