KKD: సామర్లకోట పంచారామ క్షేత్రంలో ఉగాది వేళ విషాదం నెలకొంది. పెద్దాపురం కొత్తపేటకు చెందిన వెన్నెల ప్రశాంత్ (27) ఆలయ కోనేరులో మునిగి మృతి చెందాడు. నాలుగు రోజుల క్రితమే నిశ్చితార్థం చేసుకున్న ప్రశాంత్.. కాబోయే భార్యతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చి ప్రమాదవశాత్తు నీట మునిగాడు. ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు