CTR: GD నెల్లూరు మండలం అంబోదరపల్లిలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు. ఓ కుటుంబం మరో కుటుంబసభ్యులపై కారం పొడి చల్లి కత్తితో పొడిచి, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలకృష్ణ పరిస్థితి విషమించడంతో తిరుపతికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.