WNP: వనపర్తి మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేత రాగి వేణు మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు. సోమవారం రాగి వేణు కుమారుడు చంద్రశేఖర్కు ఫోన్ లో మాట్లాడి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని అండగా ఉంటానని అన్నారు. రాగి వేణు తనకు అత్యంత సన్నిహితుడు ఆత్మీయుడు అని, మృతి చెందడం కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.