ప్రకాశం: 2010కి ముందు నియమితులైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల పదోన్నతికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని APTF రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల డిమాండ్ చేశారు. ఆదివారం మార్కాపురంలోని తమ కార్యాలయంలో మాట్లాడుతూ.. KGBV ఉపాధ్యాయులకు MTS వర్తింపజేయాలని, కరోనా సమయంలో మరణించిన కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఏలూరు పడమర వీధిలో ఆదివారం ప్రజల సౌకర్యార్థం జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ రీజినల్ జోనల్ ఆర్టీసీ ఛైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. చలివేంద్రం ప్రారంభం అనంతరం పలువురికి మజ్జిగను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ ప్రజా సేవలో జనసేన పార్టీ ముందుంటుందని జనసైనికులను అభినందించారు.
VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కేతన్ గర్గ్ తెలిపారు. ఉదయం 11 నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. జీవీఎంసీలోని అన్ని జోనల్ కార్యాలయాల్లో, కలెక్టరేట్లో, సీపీ కార్యాలయంలో ఉదయం వినతులు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
VZM: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం శ్రీ రామనారాయణంలో ఆదివారం శ్రవణ నక్షత్రం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ నారాయణ స్వామి వారికి పంచామృత అభిషేకాలు జరిపారు. ఆలయ అర్చకులు చాణక్య, హర్ష, కృష్ణ తేజ ఆధ్వర్యంలో విశిష్ట పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగార్జునరావు, భక్తులు పాల్గొన్నారు.
కర్నూలు: ఐపీఎల్ బెట్టింగ్, మట్కా, జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు చేపట్టాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం జిల్లా ఎస్పీ జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణపై ముఖ్య సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో జూద కార్యకలాపాలు కట్టడి చేయాలన్నారు.
ప్రకాశం: ఒంగోలు కేశవరాజుకుంటలోని చెన్నకేశవస్వామి కాలనీలో డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, హుడా ఛైర్మన్ షేక్ రియాజ్ హాజరై, విగ్రహాన్ని ఆవిష్కరించారు.
కోనసీమ: ర్యాలి శ్రీ జగన్మోహిని కేశవ & గోపాల స్వామి దేవస్థానంలో శ్రవణా నక్షత్ర మాస కళ్యాణం ఆదివారం వైభవంగా నిర్వహించబడింది. తదుపరి మాస కళ్యాణం మే 9న జరుగుతుందని ఆలయ ఆర్చకులు తెలిపారు. వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం, బదిలీ, పదోన్నతి, విదేశీయానం, ఆరోగ్యం, వ్యాపారం వంటి కోరికల కోసం భక్తులు ఈ మాస కళ్యాణంలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందాలని ఈవో వెంకటరమణ తెలిపారు
బాపట్ల సూర్యలంక రోడ్డులోని భావపురి బ్రాహ్మణ సదన్లో ఆదివారం పుస్తకావిష్కరణ సభ జరిగింది. డాక్టర్ వాసిరాజు రాధాకృష్ణ మూర్తి రచించిన ‘క్లైమేట్ చేంజ్ అండ్ అగ్రికల్చర్’, ‘గ్లోబల్ అండ్ ఇండియన్ హొరైజన్స్ ఆఫ్ హయ్యర్ అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్’ పుస్తకాలను మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఘనంగా ఆవిష్కరించారు.
ATP: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాల్లో గుత్తికి చెందిన టీడీపీ యువనేత రవితేజ రెండవ కుమారుడు పి.సంజయ్ నాయుడు అత్యంత ప్రతిభ కనబరిచారు. మొత్తం 470 మార్కులకు గాను 465 మార్కులు సాధించి టాపర్గా నిలిచారు. సంజయ్ నాయుడు సాధించిన ఈ విజయంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
సత్యసాయి: నూడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడి వివాహ వేడుకకు సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయనను చూసేందుకు అభిమానులు, పార్టీ శ్రేణులు ఉత్సాహం చూపారు.
SS: పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎములపల్లి చెరువు సమీపంలో రహదారి పరిస్థితి వాహనదారులకు ఇబ్బందికరంగా మారింది. చెరువు పక్కన ఉన్న మట్టి క్రమంగా దిగజారిపోవడంతో రోడ్డు అంచు బలహీనపడింది. రక్షణ గోడ లేకపోవడంతో వాహనదారులు చెరువులో పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చెరువుకు రక్షణ గోడ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
E.G: దాతల సహకారంతో ట్రాఫిక్ స్టాపర్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు రాజమహేంద్రవరం డీఎస్పీ బి.విద్య అన్నారు. ఆదివారం మండపేట టౌన్ పోలీస్టేషన్ వద్ద వీటిని ఆమె ప్రారంభించారు. డీఎస్పీ విద్య మాట్లాడుతూ.. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు దాతల సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
E.G: దాతల సహకారంతో ట్రాఫిక్ స్టాపర్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు రాజమహేంద్రవరం డీఎస్పీ బి.విద్య అన్నారు. ఆదివారం మండపేట టౌన్ పోలీస్టేషన్ వద్ద వీటిని ఆమె ప్రారంభించారు. డీఎస్పీ విద్య మాట్లాడుతూ.. మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణకు దాతల సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
GNTR: అమరావతి 190 కి.మీ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) వేగంగా రూపుదిద్దుకుంటోంది. ఈ మార్గంలో వాహనాలు ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి వీలుగా కేవలం 19 చోట్ల ఇంటర్చేంజ్లు నిర్మించనున్నారు. మొదట 17 పాయింట్లను ప్రతిపాదించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆ సంఖ్యను 19కి పెంచారు. ప్రస్తుతం ప్రాజెక్టు డీపీఆర్ పరిశీలన దశలో ఉంది.
AKP: నాతవరం బీసీ కాలనీలో శ్రీ బాల వరసిద్ధి వినాయక ఆలయ ప్రారంభోత్సవం ఆదివారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఉదయం నుంచి ప్రత్యేక హోమాలు, పూజలు నిర్వహించి అనంతరం విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నసమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.