పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో దోమతెరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రజలకు దోమతెరలను అందజేశారు. మలేరియా, డెంగ్యూ నివారణలో దోమతెరల వినియోగం ముఖ్యమని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మహాత్మ జ్యోతీరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో పూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మహిళలు, వితంతువులు, అణగారిన వర్గాల్లో హరించబడిన మానవ హక్కులు కొరకు పూలే పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
VSP: ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాదేవి అమ్మవారిని శనివారం జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి అలంకరణ కోసం నూతన వస్త్రాలు, బంగారు పూత ఆభరణాలను సమర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
KRNL: కపటి గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులకు త్రాగునీటి సమస్య తీర్చే వారు కూడా ఎవరు లేరా అని పిల్లలు ప్రశ్నించారు. అదనపు తరగతి గదులుతో పాటు బాత్రూంలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు.
ATP: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. శనివారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి నిర్వహిస్తున్న ఆకస్మిక తనిఖీలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి అరికెపూడి గాంధీ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
VZM: సమానత్వం విద్య సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అని బీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు దొగ్గ దేముడుబాబు అన్నారు. పూలే జయంతి పురస్కరించుకుని జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో, కలెక్టరేట్ వద్ద పూలే విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ, దేవర కిరణ్ పాల్గొన్నారు.
GNTR: గుంటూరు నగరంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ షేక్ నూరి ఫాతిమా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సమాజంలో సమానత్వం, విద్యా విస్తరణ కోసం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
CTR: బంగారుపాళ్యం మండల కేంద్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పూలే సేవలు, ముఖ్యంగా విద్యా రంగంలో చేసిన కృషి సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.
TPT: సాంకేతిక లోపంతో ఇవాళ ఆన్లైన్లో శ్రీవాణి టికెట్లు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 12:30గంటల నుంచి తిరుమలలో అన్నమయ్య భవన్ సమీపాన ఉన్న శ్రీవాణి కౌంటర్ వద్ద 800 టికెట్లను నేరుగా జారీ చేస్తున్నారు. టికెట్ పొందిన భక్తులు సాయంత్రం 4 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్దకు చేరుకోవాలి. రేపటి నుంచి మళ్లీ ఆన్లైన్ ద్వారానే టికెట్లు ఇస్తారు.
AKP: యువత మహాత్మా జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి అన్నారు. పరవాడ సంతబయల జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి మరువలేమన్నారు.
ATP: జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు మెగా కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. డ్రగ్స్ నివారణే లక్ష్యంగా శనివారం తెల్లవారుజాము నుంచి పోలీసులు విస్తృత సోదాలు చేపట్టారు. మొత్తం 275 ఇళ్లు తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 40 వాహనాలు సీజ్ చేశారు. అలాగే, 19 మంది రౌడీషీటర్లు, 324 మంది అనుమానితులకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
PLD: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు వినుకొండ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి జీవీ ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్య విస్తరణకు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.
అన్నమయ్య: జిల్లాలో అమలు చేసిన ‘జలధార’ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం చిన్నమండెంలో జరిగిన సూర్యఘర్ ఉచిత సౌర విద్యుత్ పథకం ప్రారంభోత్సవంలో మంత్రి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. జలధార ప్రాజెక్టు విజయానికి విశేష కృషి చేసిన కలెక్టర్ను మంత్రి ఘనంగా సన్మానించారు.
W.G: భీమవరం తహసిల్దార్ ఆఫీస్ ఆవరణలో విజ్ఞానవేదిక ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పూలే సేవా సమితి అధ్యక్షులు M.V.R. అప్పాజీ మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు పూలే అన్నారు. షేక్ కాసిం, అల్లు శ్రీనివాస్, బాషా తదితరులు పాల్గొన్నారు.
PPM: పుస్తక పఠనమే సామాజిక మార్పుకు పునాది, మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తితో మార్పు సాధ్యం ఆని DRO కె.హేమలత అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ.. సమాజంలో సమానత్వం, చదువు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, రచనలను చదవడం ద్వారానే సామాజిక మార్పు సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు.