• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు సఖినేటిపల్లిలో మెగా ఉచిత వైద్యశిబిరం

కోనసీమ: సఖినేటిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన రూరల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ కేంద్రంలో బుధవారం ఉచిత మెగా వైద్యశిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకులు హరీష్ రెడ్డి బిసం తెలిపారు. ఆయుర్వేదం, అల్లోపతితో పాటు ఏఐ వంటి నూతన విధానంలో రోగులకు పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. 

April 15, 2026 / 09:10 AM IST

మాజీ సీఎంను కలిసిన దువ్వూరు వైసీపీ కన్వీనర్

KDP: మాజీ ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డిని దువ్వూరు మండల వైసీపీ కన్వీనర్ ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని పార్టీ పరిస్థితులను శంకర్ రెడ్డి వివరించారు. కార్యకర్తలతో సమన్వయం పెంచుతూ పార్టీని బలోపేతం చేయాలని జగన్ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.

April 15, 2026 / 09:09 AM IST

తిరుచానూరులో మిథాలి రాజ్ పూజలు

TPT: మాజీ మహిళా క్రికెటర్ మిథాలి రాజ్ మంగళవారం కుటుంబ సమేతంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద సూపరింటెండెంట్ రమేశ్, ఏవిఎస్వో రాధాకృష్ణ ఆమెకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న మిథాలి రాజ్కు అర్చకులు ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయాధికారులు ఆమెకు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

April 15, 2026 / 09:06 AM IST

బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న 9మంది అరెస్ట్

CTR: పూతలపట్టులో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న 9మందిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ గోపి తెలిపారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో మెరుపు దాడి చేసి 9 మందికి బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ చేసి వారి అడ్రస్లు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 15, 2026 / 09:03 AM IST

బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా గాజుల పద్మ

ATP: అనంతపురం బార్ కౌన్సిల్ అధ్యక్షురాలిగా గాజుల పద్మజ ఎన్నికవ్వడంపై జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది జిల్లా చరిత్రలో సువర్ణ అధ్యాయమని కొనియాడారు. పార్టీ శ్రేణులతో కలిసి పద్మజను ఆమె స్వగృహంలో ఘనంగా సత్కరించారు. తండ్రి నారాయణస్వామి ఆశీస్సులతో ఆమె మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.

April 15, 2026 / 09:03 AM IST

విశాఖలో దారుణం.. కూలీని కొట్టి చంపిన తోటి కూలీలు

VSP: మధురవాడలోని బక్కన్నపాలెం సమీపంలోని ఓ లేబర్ క్యాంప్‌లో యువకుడు హత్యకు గురయ్యాడు. పీఎంపాలెం CI బాలకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం.. జార్ఖండికి చెందిన సికింధర్(19) తోటి కూలీలైన శ్యామ్, నజరుల్లతో మంళవారం వివాదం జరిగింది. దీంతో వారు విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలైన సికింధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

April 15, 2026 / 09:02 AM IST

ఎమ్మెల్యేపై ఆరోపణలు.. కేసు నమోదు

NLR: కందుకూరు MLA నాగేశ్వరరావుపై పట్టణానికి చెందిన మాదాల నరసింగరావు సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ ఎస్సై పులి శివ నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రచారం వల్ల శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని తెలిపారు. నిరాధార ఆరోపణలు చేసి పరువు నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

April 15, 2026 / 09:02 AM IST

బైకర్లు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి: SI

KDP: ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని వేముల SI ప్రవీణ్ కుమార్ సూచించారు. మంగళవారం జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు వాహన తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లలో వెళ్లేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు.

April 15, 2026 / 09:02 AM IST

పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. విద్యార్థులకు గాయాలు

W.G: పాలకొల్లు (M) పెద మామిడిపల్లి సమీపంలో 216 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెంలో ఓ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు కారులో అంతర్వేది విహారయాత్రకు వెళ్తుండగా, కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న వరిచేనులోకి దూసుకెళ్ళింది. స్థానికులు గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.

April 15, 2026 / 08:58 AM IST

నేడే ఇంటర్ ఫలితాలు విడుదల

KRNL: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను నేడు (బుధవారం) విడుదల చేయనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఉదయం 10.31 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ వెల్లడిస్తారు. విద్యార్థులు HIT TV యాప్ ద్వారా వేగంగా, సులభంగా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఫలితాల కోసం విద్యార్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

April 15, 2026 / 08:47 AM IST

కాణిపాకంలో టీటీడీ ఏకసభ్య కమిటీ సభ్యుడు

CTR: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని మాజీ ఐఏఎస్ అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం ఏకసభ్య కమిటీ సభ్యుడు దినేశ్ కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, చిత్రపటాన్ని దేవస్థానం ఈ.వో పెంచల కిషోర్ అందించారు.

April 15, 2026 / 08:31 AM IST

ప్రశాంతి నిలయంలో జేబీ కీర్తన గానకచేరి

సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో తమిళ నూతన సంవత్సర వేడుకలు జేబీ కీర్తన భరద్వాజ్ బృందం కర్ణాటక సంగీత కచేరీతో ఘనంగా ముగిశాయి. ఆల్ ఇండియా రేడియో ఏ-గ్రేడ్ కళాకారిణి అయిన కీర్తన సంప్రదాయ దేవారం స్తోత్రాలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘బ్రోచేవారెవరు’, ‘మోక్షము గలదా’ వంటి కీర్తనలను ఆమె శ్రావ్యంగా ఆలపించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు.

April 15, 2026 / 08:30 AM IST

నెరవేరిన 70 ఏళ్ల కళ

CTR: పూతలపట్టు మండలం చవటపల్లి హరిజనవాడలో అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దాదాపు 70 ఏళ్లుగా విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎట్టకేలకు ఆ కోరిక నెరవేరడంతో ఆనందం వ్యక్తం చేశారు. విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించారు.

April 15, 2026 / 08:29 AM IST

చెరువులో గుర్తుతెలియని మహిళ మృతి

BPT: అమృతలూరు మండలం కూచిపూడి ఎల్‌జీ చెరువులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి గుర్తింపుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 15, 2026 / 08:24 AM IST

నిబంధనలు ఉల్లంఘించిన వారికి అవగాహన

VZM: గుర్ల ఎస్సై నారాయణరావు ఆద్వర్యంలో స్థానిక పోలీసులు మంగళవారం రాత్రి మండల కేంద్రంలోని జంక్షన్‌ వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చలానాలు విధించారు. ఈ మేరకు ప్రజలకు ట్రాఫిక్‌ నియమాలు, సైబర్‌ నేరాలు, క్రికెట్‌ బెట్టింగ్‌, ప్రమాదాల నివారణ, తదితర అంశాలపై ఆవగాహన కల్పించామని ఎస్సై తెలిపారు.

April 15, 2026 / 08:20 AM IST