W.G: పాలకొల్లు (M) పెద మామిడిపల్లి సమీపంలో 216 జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. తాడేపల్లిగూడెంలో ఓ కళాశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు కారులో అంతర్వేది విహారయాత్రకు వెళ్తుండగా, కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న వరిచేనులోకి దూసుకెళ్ళింది. స్థానికులు గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు.